E-Paper
Advertisement

T20 WORLDCUP : టీ20 వరల్డ్ కప్ లో భారత్ జోరు

T20 WORLDCUP : టీ20 వరల్డ్ కప్ లో భారత్ జోరు
Advertisement

T20 WORLDCUP : టీ20 వరల్డ్ కప్ లో భారత్ జోరు కొనసాగుతోంది. మొదటి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను చిత్తు చేసిన రోహిత్ సేన.. రెండో మ్యాచ్ లో నెదర్లాండ్స్ ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాంటిగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 179 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (9 పరుగులు) మరోసారి నిరాస పర్చాడు. అయితే రోహిత్ ( 53), కోహ్లీ (62) , సూర్యకుమార్ యాదవ్ (51) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. 180 పరుగులతో బరిలోకి దిగిన నెదర్లాండ్ ను భారత్ బౌలర్లు కట్టడి చేశారు. వరస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో నెదర్లాండ్స్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేయగలింది. రోహిత్ సేన 56 పరుగుల భారీ తేడాతో గెలిచింది. భువనేశ్వర్, అర్షదీప్, అక్షర్ పటేల్ , అశ్విన్ రెండేసి వికెట్లు చొప్పున పడగొట్టగా షమీకి ఒక వికెట్ దక్కింది. వరసగా రెండు మ్యాచ్ లో గెలిచిన టీమిండియా గ్రూప్2 లో అగ్రస్థానంలో ఉంది. 25 బంతుల్లో 51 పరుగులతో నాటౌట్ గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఆదివారం పెర్త్ వేదికగా జరిగే మ్యాచ్ లో టీమిండియా- దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×