E-Paper
Advertisement

Suresh Raina: క్రికెటర్ నుండి రెస్టారెంట్ ఓనర్‌గా.. రైనా కొత్త బిజినెస్..

Suresh Raina: క్రికెటర్ నుండి రెస్టారెంట్ ఓనర్‌గా.. రైనా కొత్త బిజినెస్..
Advertisement

Advertisement

Suresh Raina: మామూలుగా ఒక రంగంలో సరిపడా డబ్బు, ఫేమ్ అనేది సంపాదించుకున్న తర్వాత బిజినెస్‌లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటారు కొందరు. అందులోనూ ముఖ్యంగా ఫుడ్ బిజినెస్‌లో ఎంటర్ అవ్వడానికే ఇష్టపడతారు. ఇప్పటికే చాలామంది సినీ తారలు ఫుడ్ బిజినెస్‌లోకి సక్సెస్‌ఫుల్‌గా ఎంటర్ అవ్వగా.. ఇప్పుడు క్రికెటర్లు కూడా అదే బాటపట్టారు. అందులో ముందుగా సురేశ్ రైనా తన పేరును నమోదు చేసుకున్నాడు.

యూరోప్‌లోని ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో ‘రైనా’ అనే పేరుతో సురేశ్ రైనా.. తన మొదటి రెస్టారెంట్‌ను శుభారంభం చేశాడు. కేవలం ఇండియన్ క్యూసిన్‌తో ఇది ఫారినర్స్‌ను ఆకట్టుకోనుంది. ఎమ్ ఎస్ ధోనీ.. ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించిన అదే రోజు.. రైనా కూడా రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. అంతే కాకుండా ధోనీని, రైనాను వేర్వేరుగా కాకుండా ఒకే వ్యక్తిగా చూస్తారు క్రికెట్ ఫ్యాన్స్. ఆ తర్వాత ఐపీఎల్‌లో కూడా రైనా అంత యాక్టివ్‌గా లేడు. అందుకే క్రికెట్ అభిమానులు తనను గ్రౌండ్‌లో మిస్ అవుతున్నారు. కానీ రైనా మాత్రం అదంతా మర్చిపోయి తన బిజినెస్‌పై ఫోకస్ పెట్టాడు.

సురేశ్ రైనా ఒక మంచి ఫుడీ. వేర్వేరు రెస్టారెంట్లలో భోజనం చేయడం, కొత్త కొత్త వంటకాలను ట్రై చేయడం తనకు చాలా ఇష్టం. అందుకే తనకు నచ్చిన ఇండియన్ ఫుడ్‌ను యూరోప్ ప్రజలకు పరిచయం చేయడం కోసం ఈ రెస్టారెంటును ప్రారంభించనట్టుగా రైనా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో చెప్పుకొచ్చాడు. ‘రైనా’ రెస్టారెంట్ గురించి పరిచయం చేస్తూ తన సోషల్ మీడియాలో ఒక పెద్ద పోస్ట్‌ను షేర్ చేశాడు. అంతే కాకుండా ఆ సమయంలో తనకు రెస్టారెంటులో దిగిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నాడు.

రైనా ప్రారంభించిన ఈ కొత్త ప్రయాణంలో తనకు సక్సెస్ అందాలని సినీ ప్రముఖులు, క్రికెటర్లు విష్ చేశారు. చాలామంది ఈ రెస్టారెంట్ గురించి తమ సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారు కూడా. విరాట్ కోహ్లీ కూడా ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు వచ్చినప్పుడు కచ్చితంగా రెస్టారెంటుకు వస్తాను అని మాటిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేశాడు. క్రికెట్ ద్వారా దూరమయినా కూడా తనకు నచ్చిన పని చేస్తూ రైనా హ్యాపీగానే ఉన్నాడు అనుకొని తన ఫ్యాన్స్ తృప్తి చెందుతున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×