E-Paper
Advertisement

 All Rounders : ఆల్‌రౌండర్లుగా సక్సెస్.. జట్టును గెలిపించడంలోనే ఫెయిల్.. ఎవరా ముగ్గురు?

 All Rounders : ఆల్‌రౌండర్లుగా సక్సెస్.. జట్టును గెలిపించడంలోనే ఫెయిల్.. ఎవరా ముగ్గురు?
Advertisement
All Rounders

All Rounders : ఏ ఫార్మాట్‌లో అయినా సరే ఆల్ రౌండర్లు చాలా ఇంపార్టెంట్. మరీ ముఖ్యంగా టీ20 మ్యాచ్‌లలో చాలా కీ రోల్ ప్లే చేస్తారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున ఆడుతున్న మిచెల్ మార్ష్.. అద్భుతమైన ఆల్ రౌండర్. ఏప్రిల్ 29న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో ఈ ఆసిస్ ఆల్ రౌండర్ అటు బాల్, ఇటు బ్యాట్‌తో రాణించాడు. నాలుగు ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అందులో ఒక మెయిడెన్ ఓవర్ కూడా. రాహుల్ త్రిపాఠి, మార్కమ్, బ్రూక్, సమద్‌ను ఔట్ చేశాడు. ఇక బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. ఫిలిప్ సాల్ట్‌తో కలిసి రెండో వికెట్‌కు 112 పరుగులు జోడించాడు. కాని, ఎంత కష్టపడినా.. మ్యాచ్ మాత్రం గెలవలేకపోయారు. ఇలా ఆల్ రౌండర్లుగా అద్భుతంగా ఆడినప్పటికీ.. మ్యాచ్‌ను గెలిపించలేకపోయిన సందర్భాలు ఆటగాళ్లకు చేదు జ్ఞాపకాలు అందించాయి.

1. మొయిన్ అలీ, 2019 ఐపీఎల్
ఆర్సీబీ తరపున 2019 సీజన్‌లో ఆడిన మొయిన్ అలీ… ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్ రౌండర్‌గా అద్భుతంగా రాణించాడు. 32 బాల్స్‌లో 50 పరుగులు చేయడం వల్లే ఆర్సీబీ 171 పరుగులు చేయగలిగింది. లక్ష్య ఛేదనకు దిగన ముంబై ఇండియన్స్‌ను ఆదిలోనే దెబ్బతీశాడు. ఆ మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ, డికాక్‌ను మొయిన్ అలీ ఔట్ చేశాడు. నాలుగు ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయినా సరే ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయింది.

Advertisement

2. క్రిస్ మోరిస్, 2016
2016 సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడిన సౌతాఫ్రికన్ ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్… గుజరాత్ లయన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ పర్ఫామెన్స్ చూపించాడు. ఆ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి మంచి ఊపులో ఉన్న మెక్‌కలమ్, సురేష్ రైనాను ఔట్ చేశాడు. మొత్తంగా 35 పరుగులు ఇచ్చాడు. ఆ తరువాత ఛేజింగ్‌లో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన మోరిస్.. 32 బంతుల్లో ఏకంగా 82 పరుగులు చేశాడు. 8 సిక్సులు, 4 ఫోర్లతో గుజరాత్ బౌలర్లను వణికించాడు. కాని, ఆ మ్యాచ్‌లో గుజరాతే గెలిచింది.

3. హర్భజన్ సింగ్, 2015
స్పిన్ బౌలింగ్‌లో మెరుపులు మెరిపించే హర్భజన్ సింగ్ ఆల్ రౌండర్ పర్ఫామెన్స్ చూపించాడు. 2015 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన హర్భజన్.. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బాల్, బ్యాట్‌తో అదరగొట్టాడు. ఆ మ్యాచ్‌లో ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, మురళి విజయ్ వికెట్లు పడగొట్టాడు. నాలుగు ఓవర్లలో కలిపి 20 పరుగులే ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 177 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో భాగంగా 8వ పొజిషన్‌లో బ్యాటింగ్‌కు దిగిన భజ్జీ.. 24 బాల్స్‌లోనే 64 పరుగులు చేశాడు. కాని, ఆ మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. 

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×