E-Paper
Advertisement

RCB – Stampede: RCB కి మరో ఎదురు దెబ్బ.. ఇకపై చిన్న స్వామిలో ఒక్క మ్యాచ్ కూడా ఆడేది లేదు.. ఆ గ్రౌండ్ పై నిషేధం?

RCB – Stampede: RCB కి మరో ఎదురు దెబ్బ.. ఇకపై చిన్న స్వామిలో ఒక్క మ్యాచ్ కూడా ఆడేది లేదు.. ఆ గ్రౌండ్ పై నిషేధం?
Advertisement

RCB – Stampede: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు {RCB} జట్టు మొదటిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత.. మరుసటి రోజు ఆర్సిబి హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో గ్రాండ్ సెలబ్రేషన్ నిర్వహించారు. జూన్ 4వ తేదీన నిర్వహించిన ఈ సెలబ్రేషన్స్ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఏకంగా పదకొండు మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Also Read: Sai Sudarshan: సాయి సుదర్శన్ సైంటిస్టుల రాస్తున్నాడు.. శిష్యుడిలా సుందర్ చూస్తున్నాడు… ఏంట్రా ఇద్దరి గోల.. ముందు టీమిండియాను గెలిపించండిరా

Advertisement

ఆర్సిబి ఆటగాళ్లు టీం ట్రోఫీతో వస్తుంటే చూసి.. వారిని అభినందించేందుకు మైదానానికి పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులు ఒక్కసారిగా స్టేడియంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటు చేసుకుంది. 17 సీజన్లుగా కప్పు గెలవకపోయిన ఆర్సిబి.. ఫైనల్ గా 18 వ సీజన్ లో తమ తొలి ఐపిఎల్ ట్రోఫీ సాధించడంతో బెంగుళూరులో సీఎం సిద్దరామయ్య ఆర్సిబి ఆటగాళ్లను సన్మానించే కార్యక్రమం పెట్టుకున్నారు.

ముందు విధాన సౌధకు చేరుకొని.. అక్కడ సీఎంని కలిసి, అక్కడినుండి చిన్నస్వామి స్టేడియానికి ర్యాలీగా వెళ్లాలనుకున్నారు. కానీ పోలీసులు ర్యాలీకి అనుమతించలేదు. దీంతో విధాన సౌధ నుండి నేరుగా ఆటగాళ్లు స్టేడియానికి చేరుకున్నారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకోవడంతో తొక్కీసలాట చోటు చేసుకుంది. అనంతరం నిర్వాహకులపై చర్యలు తీసుకున్నారు.

Advertisement

ఆ తరువాత ఈ కేసు హైకోర్టుకు చేరింది. బెంగళూరు జట్టు ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించింది. మరోవైపు ఈ పరిణామంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇక ఈ తొక్కిసలాటకు సంబంధించి హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ఆర్సిబి ఫ్రాంచైజీ నుంచి తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఎత్తి చూపించింది కర్ణాటక ప్రభుత్వం. ఇదిలా ఉంటే తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి {బిసిసిఐ} ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఇకపై చిన్నస్వామి స్టేడియంలో ఒక్క మ్యాచ్ కూడా నిర్వహించకూడదని.. ఆ గ్రౌండ్ పై నిషేధం విధించాలని భావిస్తుందట బీసీసీఐ. అలాగే పెద్ద సంఖ్యలో జన సమూహాలు ఉండే ఈవెంట్లను.. ఇతర వేదికలకు మార్చాలని భావిస్తుందట. భవిష్యత్తులో ఏదైనా వేదిక అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని, చిన్న స్వామి స్టేడియం సామూహిక సమావేశాలకు అనుకూలమైనది కాదని తేల్చింది జస్టిస్ జాన్ మైకేల్ కున్హా కమిషన్.

Also Read: Azam Khan: 69 కిలోలు తగ్గిన పాకిస్తాన్ వికెట్ కీపర్.. మొత్తం బీఫ్ తినడం మానేశాడా!

ఈ నివేదికపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే.. ఇకనుండి చిన్నస్వామి స్టేడియంలో అధికారిక కార్యక్రమాలు నిర్వహించడం రద్దు చేయబడుతుంది. తదుపరి కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఈ సిఫార్సులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఇకనుండి చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ లు, సమావేశాలను పూర్తిగా రద్దు చేస్తే.. ఐపీఎల్ 2026 సీజన్ లో ఆర్సిబి హోం గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో ఒక్క మ్యాచ్ కూడా నిర్వహించరు. ఇదే జరిగితే ఆర్సిబి అభిమానులకు పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పాలి.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×