E-Paper
Advertisement

Sports Allocation: బడ్జెట్ పెరిగింది.. కుమ్మేయడమే మిగిలింది..

Sports Allocation: బడ్జెట్ పెరిగింది.. కుమ్మేయడమే మిగిలింది..
Advertisement

Sports Allocation:బడ్జెట్‌లో క్రీడారంగానికి భారీగా కేటాయింపులు పెంచింది… కేంద్రం. గత బడ్జెట్ కంటే ఈసారి క్రీడలకు రూ.335 కోట్లు పెంచారు. 2022-23 బడ్జెట్‌లో క్రీడా రంగానికి రూ.3062 కోట్ల మేర కేటాయింపులు జరగ్గా.. ఈ ఏడాది అది రూ.3397 కోట్లకు పెరిగింది. బడ్జెట్‌ చరిత్రలో క్రీడారంగానికి ఈ స్థాయిలో నిధులు మంజూరు కావడం ఇదే మొదటిసారి. గత ఐదేళ్ల కేంద్ర బడ్జెట్‌లను పరిశీలిస్తే… ఒకసారి మినహా, ఏటా ఓ మోస్తరు స్థాయిలో క్రీడలకు నిధులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఏడాది ఆసియా క్రీడలు, వచ్చే ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌ ఉన్న నేపథ్యంలో… బడ్జెట్‌లో క్రీడారం‍గానికి మరింత ప్రాధాన్యత ఇచ్చారు.

2018-19 బడ్జెట్లో క్రీడలకు రూ.2,197 కోట్లు కేటాయించగా… 2019-20 బడ్జెట్లో రూ.579 కోట్లు పెంచి… రూ.2,776 కోట్లు కేటాయించారు. 2020-21 బడ్జెట్లో మాత్రం కేవలం రూ.50 కోట్లు మాత్రమే పెంచి… రూ.2,826 కోట్లు ఇచ్చారు. ఇక 2021-22లో అయితే… రూ.230 కోట్లు తగ్గించి… రూ.2,596 కోట్లకు పరిమితం చేశారు. ఇక గత బడ్జెట్లో రూ.466 కోట్లు పెంచి… రూ.3,062 కోట్లు కేటాయించారు. ఇప్పుడు రూ.335 కోట్లు పెంచి… రూ.3397 కోట్లు ఇచ్చారు.

Advertisement

స్పోర్ట్స్‌ బడ్జెట్‌లో ఖేలో ఇండియాకు రూ.1045 కోట్ల నిధులు కేటాయించారు. గత ఏడాది కంటే ఇప్పుడు రూ.439 కోట్లు ఎక్కువగా కేటాయించిందంటే… ఈ పథకానికి కేంద్రం ఎంత ప్రాధాన్యం ఇస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు రూ.785.52 కోట్ల నిధులు ఇచ్చారు. అథ్లెట్లకు జాతీయ శిబిరాలు నిర్వహించడంతో పాటు, వారికి మౌలిక సదుపాయాలు కల్పించడం… వారికి అవసరమైన సామాగ్రి కొనడం సాయ్‌ పని. ఇక నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ కు రూ.325 కోట్లు, నేషనల్ సర్వీస్ స్కీమ్ కు రూ.325 కోట్లు, నేషనల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్ కు రూ. 15 కోట్లు కేటాయించారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×