E-Paper
Advertisement

Shikhar Dhawan: అర్రెర్రె.. ధావన్ భయ్ ఎంత పనిచేశావ్? మళ్లీ క్రికెట్ ఆడతావా?

Shikhar Dhawan: అర్రెర్రె.. ధావన్ భయ్ ఎంత పనిచేశావ్? మళ్లీ క్రికెట్ ఆడతావా?
Advertisement

లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి సీజన్‌లో ఇండియా క్యాపిటల్స్ విజేతగా నిలిచింది. మళ్లీ ఈ లీగ్ లో ఆడనున్నట్టు ధావన్ తెలిపాడు. దీంతో కొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు .. గబ్బర్..ఎందుకిలా? చేస్తున్నాడని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

38 సంవత్సరాలు వచ్చినా, ఇంకా భావోద్వేగాలను నియంత్రించుకోలేక పోవడంపై నెట్టింట పలు డిబేట్లు జరుగుతున్నాయి. తను ఇంతకుముందు కుమారుడి జన్మదినోత్సవానికి కూడా ఇలాగే పబ్లిగ్గా బాధపడ్డాడు. భార్యతో విడాకుల కారణంగా, తను కుమారుడికి దూరమయ్యాడు. అలా పబ్లిగ్గా తన మనోవేదన పంచుకున్నాడు. ఇప్పుడు కూడా రిటైర్మెంట్ అవుతున్నట్టు ప్రకటించి, మళ్లీ వెనుకడుగు వేశాడు.

నిజానికి చాలామంది తెలివైన క్రికెటర్లు.. ఒకొక్క ఫార్మాట్ నుంచి వైదొలుగుతూ ఉంటారు. మొన్న విరాట్, రోహిత్, రవీంద్ర జడేజా లాంటి వాళ్లు టీ 20కి వీడ్కోలు పలికారు. వన్డే, టెస్టు మ్యాచ్ లు ఆడుతున్నారు. రేపు 2027 వరల్డ్ కప్ తర్వాత.. ఆ ఫార్మాట్ కి వీడ్కోలు పలికేలా ఉన్నారు. తర్వాత మరో ఏడాది ఆడి, టెస్ట్ క్రికెట్ కి వీడ్కోలు చెబుతారు. ఆ తర్వాత ధోనీలా 42 లేదా 44 వచ్చేవరకు ఐపీఎల్ ఆడతారు. అప్పుడక్కడ వీడ్కోలు చెబుతారు.

Advertisement

మళ్లీ రెండు రోజులకే ధావన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో పాల్గొననున్నట్లు ప్రకటించాడు. తన జీవితం నుంచి ఆటను విడదీసి చూడలేమని అన్నాడు. ఇంకా తను క్రికెట్ ఆడగలనని అన్నాడు.  మైదానంలో తన స్నేహితులను తిరిగి కలుసుకుంటున్నాని, అభిమానులకు కొత్త జ్ఞాపకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని ధావన్ పేర్కొన్నాడు.

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. గత ఐపీఎల్ సీజన్‌లో గాయం కారణంగా పంజాబ్ జట్టుకు దూరమయ్యాడు. మరిప్పుడు ఐపీఎల్ మెగా వేలానికి వెళతాడా? లేదా?అనేది చూడాలి.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×