E-Paper
Advertisement

Satya Nadella : భారత్-న్యూజిలాండ్ సెమీస్.. సత్య నాదెళ్ల కామెంట్స్ వైరల్..

Satya Nadella : భారత్-న్యూజిలాండ్ సెమీస్.. సత్య నాదెళ్ల కామెంట్స్ వైరల్..
Advertisement

Satya Nadella : వన్డే వరల్డ్ కప్ లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య బుధవారం జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ ఎంతో ఆసక్తిగా సాగింది. యావత్ క్రికెట్ ప్రపంచం ఫలితం కోసం ఉత్కంఠ ఎదురుచూసింది. టీమిండియా అద్భుతంగా ఆడి కివీస్ ను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది. దీంతో సంబరాలు అంబరాన్నింటాయి.ఈ మ్యాచ్ జరుగుతున్నంతసేపు క్రికెట్ ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోయారు. ఎంతో ఆసక్తిగా మ్యాచ్ ను తిలకించారు.

మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల కూడా భారత్- కివీస్ మ్యాచ్ ను చూశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. సియాటెల్‌లో మైక్రోసాఫ్ట్‌ డెవలపర్‌ కాన్ఫెరెన్స్‌లో పాల్గొన్న తర్వాత పూర్తిగా మ్యాచ్‌లో మునిగిపోయానని మ్యాచ్ అనుభవాలను పంచుకున్నారు. రాత్రంతా మేల్కొని ఉన్నానని వివరించారు. ఇగ్నైట్‌ పేరిట నిర్వహించిన కాన్ఫెరెన్స్‌ను షెడ్యూల్‌ చేసినప్పుడు మ్యాచ్‌ విషయంపై అవగాహన లేదని చెప్పారు. టీమిండియా సెమీస్ లో గెలిచి ఫైనల్ కు చేరుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

వన్డే ప్రపంచకప్‌ లో తొలి సెమీస్ ముంబై వేదికగా బుధవారం జరిగింది. ఈ మ్యాచ్ లో 70 పరుగుల తేడాతో కివీస్ పై భారత్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలు బాదడంతో 4 వికెట్లకు 397 పరుగుల భారీ స్కోర్ సాధించింది. శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌ మెరపులు మెరిపించారు. మహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ఏడు పడగొట్టి కివీస్ రెక్కలు విసిరాడు. దీంతో మిచెల్‌, విలియమ్సన్‌ పోరాడినా కివీస్‌ 48.5 ఓవర్లలో 327 పరుగులకే ఆలౌటైంది.

Tags

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×