E-Paper
Advertisement

Sanjay Manjrekar : ఇంగ్లాండ్.. ఒక్కడిని ఆపలేకపోయారు: సంజయ్ మంజ్రేకర్

Sanjay Manjrekar : ఇంగ్లాండ్.. ఒక్కడిని ఆపలేకపోయారు: సంజయ్ మంజ్రేకర్
Advertisement

Sanjay Manjrekar : తొలిటెస్ట్ మ్యాచ్ లో మర్మోగుతున్న ఒకే ఒక్క పేరు ఎవరిదంటే.. రవీంద్ర జడేజా అని చెప్పాలి. తనొక్కడు అడ్డంగా నిలబడిపోవడంతో ఇంగ్లాండ్ నిస్సహాయంగా నిలిచిపోయింది. తనని ఆపి ఉంటే, ఇంగ్లాండ్ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ను ఆత్మవిశ్వాసంతో ఆరంభించేదని అంటున్నారు.

టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆట తీరుపై సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆట గతినే మార్చేశాడని అన్నాడు. అప్పటివరకు ఇంగ్లాండ్ స్కోరుకి ధీటుగా టీమ్ ఇండియా స్కోరు లేకపోవడంతో ఎక్కడో చిన్న ఆందోళన ఉండేదని, అది రవీంద్ర జడేజా మార్చిపారేశాడని కొనియాడాడు.

Advertisement

మూడోరోజు ఆటను అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా జోడి మరికొంత దూరం తీసుకువెళితే, భారత్ సురక్షిత స్థానానికి చేరుతుంది. అలా  300 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు నిలబెడితే వారు ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలవుతారని మంజ్రేకర్ తెలిపాడు.

రవీంద్ర జడేజా కారణంగానే ఇంగ్లాండ్ ఓటమి పాలవనుందని తెలిపాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పలు తప్పిదాలు చేశాడని తెలిపాడు. బజ్ బాల్ ఆటతో టీమ్ ఇండియా కూడా దూకుడుగా ఆడటంతో వీరిని ఆపడం ఇంగ్లాండ్ తరం కాలేదని అంటున్నారు. జో రూట్ ని ముందు దింపకపోవడం తప్పిదమే అన్నాడు. అలాగే తుది జట్టు ఎంపిక కూడా కరెక్ట్ గా లేదని అన్నాడు.

Advertisement

ఏదైతేనేం మూడోరోజు ఆట ఇప్పుడు కీలకంగా మారనుంది. రవీంద్ర జడేజా సెంచరీ చేస్తాడా? అక్షర్ పటేల్ తో భాగస్వామ్యం ఎంతవరకు వెళుతుంది. భారత్ అనుకున్న లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచుతుందా? అనేది తేలాల్సి ఉంది.

యశస్వి జైశ్వాల్ మాట్లాడుతూ సెంచరీ మిస్ కావడంపై చింత లేదని అన్నాడు. దూకుడుగా ఆడే ఉద్దేశంతోనే మొదలెట్టానని తెలిపాడు. జోరూట్ ని నాపై ప్రయోగిస్తారని ముందే ఊహించానని తెలిపాడు. అయితే అన్నివేళలా షాట్ సెలక్షన్స్ కరెక్ట్ గా ఉండవని తెలిపాడు. ఇంకా నేర్చుకోవాల్సి ఉందని, తన ఆటతీరులో లోపాలను సరిచేసుకోవాల్సి ఉందని అన్నాడు.

తొలి టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేసి ఉంటే బాగుండేది, కానీ రికార్డ్స్ కోసం ఆడటం కన్నా, జట్టు కోసం ఆడాలని అనుకుంటానని తెలిపాడు. అలాగే భారతదేశం తరఫున ఆడటాన్ని గర్వంగా ఫీలవుతానని తెలిపాడు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×