E-Paper
Advertisement

SA vs IND 3rd ODI : సెంచరీతో చెలరేగిన శాంసన్.. వన్డే సిరీస్ టీమిండియా సొంతం..

SA vs IND 3rd ODI : సెంచరీతో చెలరేగిన శాంసన్.. వన్డే సిరీస్ టీమిండియా సొంతం..
Advertisement

SA vs IND 3rd ODI : భారత యువ జట్టు అదరగొట్టింది. గత జనవరిలో స్టార్ ప్లేయర్లు ఉన్నా.. భారత్ వన్డే సిరీస్ ను కోల్పోయింది. ఇప్పుడు కుర్ర జట్టు దక్షిణాఫ్రికాను దక్షిణాఫ్రికాలోనే దెబ్బతీసి ప్రతీకారం తీర్చుకుంది. గత సిరీస్ లో ఆటగాళ్లెవరూ జట్టులో లేకపోయినా.. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో యువ జట్టు దక్షిణాఫ్రికాపై మూడు వన్డేల సిరీస్‌ పట్టేసింది. గురువారం ఆఖరి వన్డేలో 78 పరుగుల తేడాతో సఫారీలను ఓడించి సిరీస్‌ను గెలుచుకుంది.

సంజు శాంసన్‌ 108 పరుగులతో సెంచరీ చేయగా.. భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగులు చేసింది. సంజు శాంసన్ 114 బంతుల్లో 108 పరుగులు చేయగా.. తిలక్ వర్మ 77 బంతుల్లో 52 పరుగులతో రాణించాడు. లక్ష్య ఛేదనలో భారత బౌలర్ల ధాటికి సఫారీ జట్టు 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో సిరీస్ భారత్ కైవసం చేసుకుంది.

Advertisement

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా సంజు శాంసన్ నిలవగా.. అర్షదీప్ సింగ్ కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. అంతకు ముందు టీ-20 సిరీస్‌ను సమం చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. జనవరి 26 నుంచి టెస్టు సిరీస్‌ జరగనుంది.

.

Advertisement

.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×