E-Paper
Advertisement

Akash Deep : కొత్త కారు కొన్న ఆకాష్ దీప్ కు నోటీసులు.. కారణం ఇదే..!

Akash Deep : కొత్త కారు కొన్న ఆకాష్ దీప్ కు నోటీసులు.. కారణం ఇదే..!
Advertisement

Akash Deep :  టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ముఖ్యంగా బర్మింగ్ హోమ్ వేదికగా జరిగిన ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ మ్యాచ్ అందరికీ తప్పక గుర్తుకే ఉండి ఉంటుంది. ఇంగ్లాండ్ పర్యటనలో రెండో టెస్ట్ మ్యాచ్ తరువాత ఈ టిమిండియా బౌలర్ ఒక్కసారిగా సంచలనంగా మారాడు. ఇక ఆ తరువాత 5వ టెస్ట్ లో సాయి సుదర్శన్ ఔట్ కాగానే నైట్ వాచ్ మెన్ గా ఆకాశ్ దీప్ బ్యాటింగ్ కి వచ్చి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 5వ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో 66 పరుగులు చేశాడు.  దీంతో మళ్లీ క్రేజీ అమాంతం పెరిగిపోయింది. ఇక ఇదిలా ఉంటే.. మరోవైపు కొత్త కారుకొని సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. తన కుటుంబంతో కలిసి కొత్త కారుతో ఫొటోతో దిగిన కొద్ది రోజులకే తాజాగా ఆర్టీవో అధికారులు నోటీసులు ఇచ్చారు.

Also Read :  Asia Cup winners : ఇప్పటివరకు ఆసియా కప్ గెలిచిన జట్లు ఇవే.. టీమిండియాకే ఎక్కువ ట్రోఫీలు వచ్చాయా!

Advertisement

భారత క్రికెటర్ ఆకాష్ దీప్ తన “డ్రీమ్” కారును కొనుగోలు చేశాడు, ఒక లగ్జరీ SUVని కొనుగోలు చేశాడు. గత వారం హృదయపూర్వక పోస్ట్‌లో తన సోదరీమణులతో పోజులిచ్చాడు. ఈ నేపథ్యంలోనే అతన్ని  ఊహించని చిక్కుల్లో పడేసింది.  ఆకాశ్ దీప్ కి  లక్నోలోని ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) నోటీసు పంపించినట్టు సమాచారం. ఆకాశ్ దీప్ కి  ఆగస్ట్ 11, సోమవారం నాడు నోటీసు జారీ చేసింది, అసంపూర్తిగా రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ మరియు అవసరమైన హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (HSRP) మరియు మూడవ రిజిస్ట్రేషన్ మార్క్ (TRM) తప్పిపోయిన కారణంగా పబ్లిక్ రోడ్‌లపై కొత్తగా కొనుగోలు చేసిన SUV వినియోగాన్ని నిలిపివేసింది. అన్ని వాహనాల డాక్యుమెంటేషన్ అవసరాలను పాటించాలని మరియు 72 గంటల్లో సంబంధిత అధికారుల ముందు హాజరు కావాలని నోటీసులో భారత యువ పేసర్‌ను ఆదేశించింది.

ఆకాశ్ కి వారు విషెష్ 

Advertisement

ఆకాశ్ దీప్ కొన్న ఆ కారు టాప్ మోడల్ దర రూ.62లక్షలకు ఉంటుందని సమాచారం. ఈ కారు కొనుగోలు చేసిన వెంటనే పలువురు టీమిండియా క్రికెటర్లు ఆకాశ్ కి విషెష్ కూడా చెప్పారు. ప్రస్తుతం ఈ కారుకి సంబంధించి.. ఆర్టీవో నోటీసులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి 2024 ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ తో జరిగిన 5టెస్ట మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా చివరి మూడు టెస్టుల్లో ఆకాశ్ దీప్ తొలిసారిగా భారత టెస్ట్ జట్టులో స్థానం సంపాదించాడు. తొలి రెండు టెస్టులకు ఎంపికైన ఆవేశ్ ఖాన్ స్థానంలో ఆకాశ్ దీప్ కి ఆ సమయంలో చోటు లభించింది. ఆకాశ్ దీప్ అంతకు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్ట తరపున ఐపీఎల్ ఆడాడు. ఇక దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించి 29 మ్యాచ్ ల్లోనే 103 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. వీటిలో దాదాపు 4సార్లు 5 వికెట్లను తీసిన ఘనత సాధించాడు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×