E-Paper
Advertisement

Rinku Singh: రింకు సింగ్ కు దావూద్ గ్యాంగ్ బెదిరింపులు..రూ.5 కోట్లు కావాలంటూ?

Rinku Singh: రింకు సింగ్ కు దావూద్ గ్యాంగ్ బెదిరింపులు..రూ.5 కోట్లు కావాలంటూ?
Advertisement

Rinku Singh : టీమిండియా ఫినిషర్ రింకు సింగ్ కు ( Rinku Singh) ఊహించని పరిణామం ఎదురైంది. రింకు సింగ్ కు తాజాగా బెదిరింపులు వచ్చాయి. ఈ యంగ్ కుర్రాడు రింకు సింగ్ ను దావూద్ గ్యాంగ్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఫోన్లు చేసి బెదిరింపులకు కూడా దిగారట. ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారట. దావూద్ గ్యాంగ్ పేరుతో ఫోన్ చేసి టార్చర్ పెట్టే ప్రయత్నం చేశారట. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: Rohit Sharma: గంభీర్ వ‌ల్ల ఒరిగిందేమీ లేదు, ద్రావిడ్ వ‌ల్లే ఛాంపియన్స్ ట్రోఫీ..ఇజ్జ‌త్ తీసిన రోహిత్ శ‌ర్మ

Advertisement

రింకు సింగ్ కు దావూద్ గ్యాంగ్ నుంచి బెదిరింపు ఫోన్లు

టీమిండియా యంగ్ క్రికెటర్ రింకు సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ కుర్ర క్రికెటర్ రింకు సింగ్ అతి తక్కువ కాలంలోనే టీమిండియాలోకి వచ్చాడు. కేకేఆర్ జట్టు తరఫున అద్భుతమైన ప్రదర్శన కనబరిచి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు రింకు సింగ్. ముఖ్యంగా యష్ దయాల్ బౌలింగ్ లో ఐదు సిక్సర్లు కొట్టి పాపులర్ అయిపోయాడు. ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇక టీమ్ ఇండియాలో టి20 స్పెషలిస్ట్ గా మారిపోయిన రింకు సింగ్ ను వణికించేందుకు దావూద్ గ్యాంగ్ రంగంలోకి దిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అండర్ వరల్డ్ డాన్ గ్యాంగ్ సభ్యుల నుంచి రింకు సింగ్ కు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తాజాగా ముంబై క్రైమ్ పోలీసులు గుర్తించారు.

Advertisement

ఈ మేరకు మీడియాకు సమాచారం ఇచ్చారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో దాదాపు మూడుసార్లు బెదిరింపు హెచ్చరికలు వచ్చాయట. ఇందులో టీమిండియా కుర్ర క్రికెటర్ రింకు సింగ్ ను ( Rinku Singh) 5 కోట్లు డిమాండ్ చేసినట్లు ముంబై పోలీసులకు వెల్లడించారు. ఈ బెదిరింపుల వ్యవహారంలో మొహమ్మద్ దిల్షాద్ అలాగే మహమ్మద్ నవీన్ అనే ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. వీళ్ళిద్దరూ వెస్టిండీస్ ప్రాంతంలో నివసిస్తుండగా, ఆగస్టు ఒకటో తేదీన ఇండియన్ అధికారులకు అప్పగించారట. అయితే ఇప్పుడు ఈ విషయం నేషనల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: Abhishek Sharma Car: అభిషేక్ కారుకు ఇండియాలో నో ప‌ర్మిష‌న్‌…దుబాయ్ లో వ‌దిలేశాడుగా !

త్వ‌ర‌లోనే రింకు సింగ్ పెళ్లి

ఉత్త‌ర ప్ర‌దేశ్ పార్ల‌మెంట్ స‌భ్యులు ప్రియా స‌రోజ్ అనే యువ‌తిని ప్రేమించి, పెళ్లి చేసుకోబోతున్నాడు రింకు సింగ్‌. ఈ ఏడాది జూన్ 8వ తేదీన ప్రియా స‌రోజ్, రింకు సింగ్ ఎంగేజ్ మెంట్ జ‌రిగింది. లక్నోలోని ఏ ప్ర‌ముఖ హోట‌ల్ లో ఈ ఎంగేజ్ మెంట్ జ‌రుగ‌నుంది. అతి కొంది మంది స‌మ‌క్షంలోనే రింకు సింగ్ ఎంగేజ్ మెంట్ నిర్వ‌హించారు. వ‌చ్చే ఏడాది వీళ్ల ఇద్ద‌రి వివాహం చాలా గ్రాండ్ గా జ‌రుగ‌నుంది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×