E-Paper
Advertisement

Rinku Singh : మ్యాచ్ నిలబెట్టిన రింకూ సింగ్.. 92పరుగులతో సెంచరీ మిస్..

Rinku Singh : దేశవాళి క్రికెట్ లో ఉత్తర ప్రదేశ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న రింకూసింగ్ విధ్వంసం సృష్టించి మ్యాచ్  చేజారిపోకుండా నిలబెట్టాడు. దేశంలో ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ లో భాగంగా ఎలైట్ గ్రూప్ బీలో కేరళతో జరిగిన మ్యాచ్ లో రింకూ సింగ్ 92 పరుగులు చేసి సెంచరీ ముందు అవుట్ అయ్యాడు.

Rinku Singh : మ్యాచ్ నిలబెట్టిన రింకూ సింగ్.. 92పరుగులతో సెంచరీ మిస్..
Advertisement

Rinku Singh : దేశవాళి క్రికెట్ లో ఉత్తర ప్రదేశ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న రింకూసింగ్ విధ్వంసం సృష్టించి మ్యాచ్  చేజారిపోకుండా నిలబెట్టాడు. దేశంలో ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ లో భాగంగా ఎలైట్ గ్రూప్ బీలో కేరళతో జరిగిన మ్యాచ్ లో రింకూ సింగ్ 92 పరుగులు చేసి సెంచరీ ముందు అవుట్ అయ్యాడు.

124 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ యూపీనీ తనదైన శైలిలో ఆదుకున్నాడు. మరో ఎండ్ లో  ధృవ్ జురెల్ (63) సాయంతో స్కోరు బోర్డుని పరుగులెత్తించాడు. ఆరో వికెట్‌కు 143 పరుగులు జోడించాడు. అలా 136 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 92 పరుగులు చేశాడు.

Advertisement

తను టీ 20, వన్డేలు మాత్రమే కాదు, టెస్ట్ క్రికెట్ కూడా ఆడగలను, ఆ సామర్థ్యం కూడా ఉందని టీమ్ ఇండియా సెలక్టర్లకు పరోక్షంగా తెలిపాడు. అయితే సెంచరీ మిస్ చేసుకున్నా ఉత్తరప్రదేశ్‌ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

యూపీ తొలి ఇన్నింగ్స్ లో 83.4 ఓవర్లలో 302 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రింకూసింగ్ తాజాగా టీ 20 మ్యాచ్ ల్లో ఎంట్రీ ఇచ్చి అద్భుతంగా ఆడుతున్నాడు. బెస్ట్ ఫినిషర్ రోల్ కి అతికినట్టు సరిపోతున్నాడు. ఇప్పుడు టెస్టుల్లో కూడా రింకూ సింగ్ కి చోటు దొరికితే సీనియర్లు త్వరగా అవుట్ అయినా, తను ఆదుకుంటాడని అంటున్నారు.

Advertisement

ఐపీఎల్ లో ధోనీ జట్టు అయిన చెన్నై సూపర్ కింగ్స్ కి చిన్న ఝలక్ తగిలింది. ధోనీ మార్గదర్శకత్వంలో క్రీడాకారులని కొనుగోలు చేసిన ఆ ఫ్రాంచైజీ యూపీ ప్లేయర్ సమీర్ రిజ్వీని రూ. 8.40 కోట్లకు కొనుగోలు చేసింది.

ఇంతకీ విషయం ఏమిటంటే తను కేవలం 26 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అయితే ధోనీ ఏం చూసి తనని తీసుకున్నాడో తెలీదు. ఐపీఎల్ లో అతని ప్రతిభను చూడవచ్చునని కొందరు అంటున్నారు. రింకూసింగ్ కూడా తన శిష్యుడే కదా అని గుర్తు చేస్తున్నారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ బరిలోకి దిగిన కేరళ 34 ఓవర్లలో 3 వికెట్లకు 125 పరుగులు చేసింది. క్రీజులో సచిన్ బేబీ‌తో పాటు విష్ణు వినోద్ ఉన్నారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×