E-Paper
Advertisement

India Open 2025: ఇండియా ఓపెన్ లో పీవీ సింధు.. పెళ్లి తర్వాత తొలి సిరీస్!

India Open 2025:  ఇండియా ఓపెన్ లో పీవీ సింధు.. పెళ్లి తర్వాత తొలి సిరీస్!
Advertisement
India Open 2025:   భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ( PV Sindhu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల పెళ్లి చేసుకొని సందడి చేసింది పీవీ సింధు. తన సమీప బంధువైన ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది పీవీ సింధు. దీంతో గత పది రోజులుగా పీవీ సింధు గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూనే ఉంది. అయితే ఇలాంటి నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది పీవీ సింధు. పెళ్లయి నెలరోజులు కాకముందే… గ్రౌండ్ లోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంది పీవీ సింధు.

ఇండియా ఓపెన్ ప్రపంచ సూపర్ 750 టోర్నమెంట్ లో  ( India Open 2025 )భారత స్టార్ షట్లర్ పివి సింధు ( PV Sindhu )  ఆడబోతుంది. పీవీ సింధు తో పాటు లక్ష సేన్ కూడా బరిలో దిగబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈనెల 14వ తేదీన ఢిల్లీలో… ఇండియా ఓపెన్ ప్రపంచ సూపర్ 750 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో…. ఇండియా నుంచి… పీవీ సింధుతో ( PV Sindhu ) పాటు చాలామంది బరిలో దిగబోతున్నారు.

ఈ టోర్నమెంట్ లో భాగంగా పురుషుల సింగిల్స్ లో లక్ష్యాసేన్, హెచ్ ఎస్ ప్రణయ్ అలాగే ప్రియాంష్ రాజావత్, తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అదే సమయంలో మహిళల సింగిల్స్ లో పీవీ సింధు పాల్గొంటున్నారు. పీవీ సింధు తో పాటు మాళవిక బన్సోద్, అనుపమ ఉపాధ్యాయ అలాగే ఆకర్షి కస్యప్ లాంటి ప్లేయర్లు కూడా బరిలో దిగబోతున్నారు.

Advertisement

ఇక్కడ ప్రత్యేక విషయం ఏంటంటే… పెళ్లి జరిగిన తర్వాత పీవీ సింధు పాల్గొనే మొదటి టోర్నమెంట్ ఇదే కావడం విశేషం. దీంతో పెళ్లి తర్వాత పీవీ సింధు ఎలా ఆడుతుంది అనే దాని పైన అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అటు పెళ్లి తర్వాత మొదటి సక్సెస్ అందుకోవాలని పివి సింధు కసరత్తులు మొదలు పెట్టిందట. పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ – అలాగే చిరాగి శెట్టి జోడి ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Yuzvendra Chahal: విడాకులపై చాహల్ సంచలన పోస్ట్..రీసౌండ్ రావడం పక్కా ?

Advertisement

అటు సాయి ప్రదీప్ అలాగే పృద్వి… జంట బర్రిలో దిగబోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మహిళల డబుల్స్ గేమ్స్ లో మాత్రం… ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉండబోతుంది. ఈసారి గాయత్రి గోపీనాథ్ అలాగే టిస్రా జాలి బరిలో ఉండనున్నారు. అశ్విని పొన్నప్ప – తనీషా పోటీ పడనున్నారని చెబుతున్నారు. ఏదేమైనా ఈ ఇండియా ఓపెన్ ప్రపంచ సూపర్ 750 టోర్నమెంట్ లో  ( India Open 2025 ) పీవీ సింధు రాణించాలని చాలా మంది కోరుతున్నారు.

భారత ఆటగాళ్ల జాబితా:

  • MS – లక్ష్య సేన్, HS ప్రణయ్, ప్రియాంషు రాజావత్
  • WS — PV సింధు, మాళవిక బన్సోద్, అనుపమ ఉపాధ్యాయ, ఆకర్షి కశ్యప్
  • MD — చిరాగ్ శెట్టి/సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, K సాయి ప్రతీక్/పృథ్వీ K రాయ్
  • WD — ట్రీసా జాలీ/గాయత్రీ గోపీచంద్, అశ్విని పొన్నప్ప/తనీషా క్రాస్టో, రుతుపర్ణ పాండా/శ్వేతపర్ణ పాండా, మాన్సా రావత్/గాయత్రీ రావత్, అశ్విని భట్/శిఖా గౌతమ్, సాక్షి గహ్లావత్/అపూర్వ గహ్లావత్, సానియా సిక్కందర్, గణేష్‌మీర్ గణేశర్/రష్మీపీ
  • XD — ధృవ్ కపిల/తనీషా క్రాస్టో, K సతీష్ కుమార్/ఆద్య వారియత్, రోహన్ కపూర్/G రుత్విక శివాని, ఆశిత్ సూర్య/అమృత ప్రముత్తేష్

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×