E-Paper
Advertisement

PM Modi : డ్రెస్సింగ్ రూమ్ లో ప్రధాని..ఆటగాళ్ల భావోద్వేగం

PM Modi : డ్రెస్సింగ్ రూమ్ లో ప్రధాని..ఆటగాళ్ల భావోద్వేగం
Advertisement
PM Modi in Indian dressings room

PM Modi : టీమ్ ఇండియా ఫైనల్ మ్యాచ్ చూసేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. మ్యాచ్ ఆసాంతం చూసిన తర్వాత ఫైనల్ లో గెలిచిన ఆస్ట్రేలియా జట్టుకి ట్రోఫీ అందజేశారు. తర్వాత తిరిగి వెళ్లిపోకుండా ఒక బాధ్యత గల ప్రధానిగా భారత క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లారు. ఒక్కసారి ఆయన్ని చూడగానే క్రికెటర్లు అందరూ భావోద్వేగానికి గురయ్యారు. మహ్మద్ షమీ అయితే ప్రధానిని పట్టుకుని ఏడ్చాడు. సిరాజ్ కూడా భావోద్వేగాన్ని ఆపుకోలేక పోయాడు.

మోదీ వారిని ఓదార్చారు. గెలుపు ఓటములు ఆటలో సహజమని అన్నారు. ఇంతవరకు మీరు ఆడిన ఆట తీరుతో 140 కోట్ల మంది భారతీయుల మనసులను గెలుచుకున్నారని అన్నారు. అది చాలు అని అన్నారు. అలాంటి సమయంలో ఒక దేశ ప్రధాని క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లడం గ్రేట్ అయితే, నిరాశ, నిస్ప్రహల మధ్య కూరుకుపోయిన ప్లేయర్లకు మనో ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయడం మరింత గొప్ప విషయమని మోదీని కొనియాడుతున్నారు. మోదీ వెళ్లిన తర్వాత ఆటగాళ్లు ముఖం మీద చిరునవ్వు వచ్చింది. మనోధైర్యం పెరిగింది.

Advertisement

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వద్దకు మోదీ వచ్చిన విషయాన్ని భారత క్రికెటర్లు రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ తమ ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఫోటోలు పోస్ట్ చేసిన ఇద్దరు క్రికెటర్లు.. డ్రెస్సింగ్ రూమ్ వద్దకు వచ్చి ప్రోత్సాహం అందించినట్లు ప్రధానికి ధన్యవాదాలు తెలియజేశారు.

2019లో చారిత్రాత్మక చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైందని అంతరిక్ష సంస్థ ప్రకటించింది. అది చూడటానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ విషయం తెలిసిన తర్వాత కంటతడి పెట్టుకుంటున్న ఇస్రో చీఫ్ కె శివన్‌ను ఓదార్చారు.ఆ స్ఫూర్తితో ఇస్రో సైంటిస్టులు రెట్టించిన ఉత్సాహంతో చంద్రయాన్ 3 ప్రయోగించి సక్సెస్ అయ్యారు.

Advertisement

ఇప్పుడందరూ అదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వచ్చే వరల్డ్ కప్ 2027 మనదేనని ఢంకా భజాయించి చెబుతున్నారు.

.

.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×