E-Paper
Advertisement

Mirabai Chanu 4th place: పారిస్ ఒలింపిక్స్.. భారత్ ఆటగాళ్లు అక్కడే ఆగిపోయారు..

Mirabai Chanu 4th place: పారిస్ ఒలింపిక్స్.. భారత్ ఆటగాళ్లు అక్కడే ఆగిపోయారు..
Advertisement

Mirabai Chanu 4th place: పారిస్ ఒలింపిక్స్ 2024 భారత ఆటగాళ్లు మరిచిపోరు.. ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. గెలుస్తామని భావించిన ఆటగాళ్లపై వేటు వేసింది. మరికొందరు అనూహ్య పరిణామాలతో వెనుదిగిరారు. ఏళ్ల తరబడి తాము కష్టపడిన కష్టమంతా పోయిందని మరికొందరి ఆవేదన.

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం చేజారింది. బుధవారం రాత్రి జరిగిన 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను కాంస్య పతకం కోల్పోయింది. కేవల ఒక్క కేజీతో పతకానికి దూరంగా నిలిచిం ది. మణిపూర్‌కి చెందిన మీరాబాయి మొత్తం 199 కేజీలు ఎత్తి నాలుగో స్థానంలో నిలిచింది.

Advertisement

స్నాచ్‌లో 88 కేజీలెత్తిన చాను, క్లీన్ అండ్ జర్క్‌లో 111 కిలోలు బరువు ఎత్తింది. టోటల్‌గా 199 కేజీలు ఎత్తింది మీరాబాయి. ఇదే పోటీలో చైనాకు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ హౌజిహుయి 206 కేజీలు ఎత్తి బంగారు పతకాన్ని దక్కించుకుంది. రొమేనియా వెయిట్ లిఫ్టర్ మిహేలా వాలైంటీనా 205 కేజీలు, థాయ్‌లాండ్‌కు చెందిన సురోచనా 200 కేజీలు ఎత్తి థర్డ్ ప్లేస్‌లో నిలిచింది.

ALSO READ: సంచలన నిర్ణయం.. రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వినేష్ ఫొగట్

Advertisement

మనుబాకర్.. 25 మీటర్ల పిస్టల్ ఫైనల్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌ల్లో దేశానికి రెండు కాంస్య పతకాలు తీసుకొచ్చింది.

అర్జున్ బాబుట.. పారిస్ ఒలింపిక్స్ 2024లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిం చాడు, అతడు కేవలం నాలుగో స్థానంలో 20 షాట్ల తర్వాత బాబుటా మొత్తం 208.4 పాయింట్లు మాత్రమే సాధించాడు.

ధీరజ్-అంకిత.. ఆర్చరీ మిక్స్‌డ్ విభాగంలో ఈ జోడి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. వీరిద్దరు కాంస్య పతకం పోరులో అమెరికాకు చెందిన బ్రాడీ ఎలిసన్-కేజీ‌కౌఫ్ జరిగిన పోరులో ఓటమి పాలయ్యారు.

అనంత్ జీత్-మహేశ్వరి.. షూటింగ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఈ జోడి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. వీరిద్దరు 43 పాయింట్లు సాధించగా, చైనాకు చెందిన జియాంగ్-జియాన్లిన్ జోడి 44 పాయింట్లు సాధించి కాంస్య పతకం ఎగురేసుకుపోయారు.

లక్ష్యసేన్.. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో కాంస్యం కోసం జరిగిన పోరులో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. మలేషియాకు చెందిన ఆటగాడి లీజి జియాతో తలపడ్డాడు సేన్. తొలి సెట్‌ను గెలుచు కున్న సేన్, రెండో సెట్‌లో తడబడ్డాడు. ఫలితంగా మూడో సెట్‌కు దారి తీసింది. అందులోనూ ఓటమిపాలయ్యాడు లక్ష్యసేన్.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×