E-Paper
Advertisement

Abid Ali: టీమిండియా ఓడిన ప్ర‌తీరోజు పాకిస్తాన్ లో రంజాన్ పండగే

Abid Ali: టీమిండియా ఓడిన ప్ర‌తీరోజు పాకిస్తాన్ లో రంజాన్ పండగే
Advertisement

Abid Ali on Team India: ఐర్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా (Ireland vs. Team India) మధ్య ఇటీవల టి20 సిరీస్ ఫినిష్ అయిన సంగతి తెలిసిందే. ఈ టి20 సిరీస్ నేపథ్యంలో టీమిండియా చిత్తుగా ఓడిపోయి వైట్ వాష్ అయింది. ఈ క్రమంలో టీమిండియా జట్టు పై దారుణంగా విమర్శలు వస్తున్నాయి. సీనియర్ క్రికెటర్లను పక్కకు పెట్టిన భారత క్రికెట్ నియంత్రణ మండలి.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని భారత జట్టును ఐర్లాండ్ టూర్ కు పంపింది. ఈ టోర్నమెంట్ లో యువ క్రికెటర్లు మాత్రమే పాలుపంచుకున్నారు. అలాగే గౌతమ్ గంభీర్ అనవసరంగా తుది జట్టు ఎంపికలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల టీమిండియా ఓడిపోయిందని విమర్శలు కూడా వస్తున్నాయి.

Also Read: Rajasthan-born Jai Moondra moved to Dublin : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్‌..ఓడించింది మ‌న ఇండియా వాడే, ఎవ‌రీ జై మూండ్రా ?

Advertisement

ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, ఇత‌రులు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. తాజాగా ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయిన అంశాన్ని గుర్తు చేస్తూ పాకిస్థాన్ క్రికెటర్ అబిద్ అలీ ( Pakistan cricketer Abid Ali ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోవడం తమకు ఆనందాన్ని కలిగించిందని హాట్ కామెంట్స్ చేశారు. ఇండియా ఓడిపోయిన రోజు తమకు రంజాన్ పండుగ లాంటిది అంటూ వివాదాస్పద స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో అబిద్ అలీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

టీమిండియా ఓడిన ప్ర‌తీరోజు పాకిస్తాన్ లో రంజాన్ పండగే

ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయిన విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ పాకిస్తాన్ క్రికెటర్లు రెచ్చిపోతున్నారు. యువ క్రికెటర్లతో కూడిన టీమ్ ఇండియా ఓడిపోయిన అంశాన్ని మన ఇండియన్ ఫ్యాన్స్ మర్చిపోతుంటే.. ఆ పాత గాయాన్ని మళ్లీ తట్టి లేపుతున్నారు పాకిస్తాన్ క్రికెటర్లు. తాజాగా ఐర్లాండ్ చేతిలో ఓడిపోయిన టీమ్ ఇండియాను ఉద్దేశించి, పాకిస్థాన్ క్రికెటర్ అబిద్ అలీ ( Pakistan cricketer Abid Ali ) వివాదాస్పద స్టేట్మెంట్ ఇచ్చారు. ఐర్లాండ్ చేతిలో టీమిండియా రెండు మ్యాచ్ లు ఓడిపోయిందని.. ఆ రెండు మ్యాచ్ లు తాము కళ్లారా చూసామని వ్యాఖ్యానించారు. ఇక టీమిండియా ఓడిపోయిన క్షణంలో తమకు ఎంతో ఆనందం వేసింది అంటూ తమ కుట్ర కోణాన్ని బయటపెట్టారు.

Advertisement

టీమిండియా ఓడిపోయిన ప్రతిరోజు పాకిస్తాన్ లో దేశంలో రంజాన్ పండుగ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ గెలిచిన టీమ్ ఇండియా బలుపు మొత్తం… ఐర్లాండ్ దెబ్బకు దిగిందని హాట్ కామెంట్స్ చేశారు. ఇకపై టీమిండియా ఒళ్ళు దగ్గర పెట్టుకొని… ఆడితేనే బెటర్ అని సూచనలు చేశారు. దీంతో పాకిస్థాన్ క్రికెటర్ అబిద్ అలీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. త‌న్వీర్ అహ్మ‌ద్, ఇంజ‌మామ్, షోయ‌బ్ అక్త‌ర్ లాంటి వాళ్లు కూడా టీమిండియా ప‌రువు తీసేలా మాట్లాడుతున్నారు.

Also Read: Muhammad Waseem Blames Team India టీమిండియాను ఆ రెండు శాపాలు ప‌ట్టి పీడుస్తున్నాయి..అందుకే చిత్తుగా ఓడిపోయింది

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×