E-Paper
Advertisement

BAN W vs PAK W: కామెంట్రీలో అజాద్ కశ్మీర్ అంటూ వ్యాఖ్యలు…క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌నంటూ సనా మిర్‌ పోస్టు

BAN W vs PAK W: కామెంట్రీలో అజాద్ కశ్మీర్ అంటూ వ్యాఖ్యలు…క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌నంటూ సనా మిర్‌ పోస్టు
Advertisement
BAN W vs PAK W:  ప్రస్తుతం ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే టీమిండియా మొదటి మ్యాచ్ గెలిచి మంచి ఊపులో కనిపిస్తోంది. అయితే.. టీమ్ ఇండియా మొదటి మ్యాచ్లో విజయం సాధిస్తే… మన దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం… మొదటి మ్యాచ్లో దారుణం ఓటమి చవిచూసింది. అది కూడా బంగ్లాదేశ్ చేతిలో అత్యంత దారుణంగా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా… పాకిస్తాన్ దేశానికి చెందిన ఓ మాజీ క్రికెటర్ వివాదాస్పద కామెంటరీ చేశారు. ఆమె కామెంట్ చేస్తూనే అజాద్ కాశ్మీర్…. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె చేసిన కామెంట్రీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆజాద్ కాశ్మీర్ అంటూ కామెంట్రీ

మహిళల వన్డే వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య నిన్న మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో… వివాదాస్పద సంఘటన చోటుచేసుకుంది. న‌టాలియా అనే ప్లేయర్ అజాద్ కశ్మీర్…. నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని కామెంటేట‌ర్ బాంబు పేల్చారు. దీంతో ఇండియా అలాగే పాకిస్తాన్ దేశాలకు సున్నితమైన ప్రాంతం అయిన కాశ్మీర్ గురించి… ఈ వ్యాఖ్యలు చేయడం ఏంటని భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ నుంచి రాజకీయాలను దూరంగా ఉంచాలని నీతులు చెబుతున్న పాకిస్తాన్ నేతలు…. ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారని నిలదీస్తున్నారు నెటిజన్స్. అయితే ఇక్కడ ప్రత్యేక విషయం ఏంటంటే… అజాది కాశ్మీర్ అనే వ్యాఖ్యలు చేసిన కామెంట్రేటర్ సనా మిర్. ఆమె పాకిస్తాన్ దేశానికి సంబంధించిన మాజీ క్రికెటర్. మాజీ క్రికెటర్ కావడంతో… ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై నేటిజన్స్ మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్ప‌నంటూ సనా మిర్ పోస్టు

వివాదంలో చిక్కుకున్న సనా మిర్‌ పైన ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు బీసీసీఐకి సంబంధించిన కొంతమంది అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ వివాదం పై సనా మిర్‌ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించకుండా… తన వ్యాఖ్యలు సరైనవి అన్నట్లుగా వ్యవహరించారు. నటాలియా అనే అమ్మాయి అజాద్ కశ్మీర్ ప్రాంతం నుంచి వచ్చిందని… ఆమె కుటుంబ పరిస్థితులను వివరించినట్లు వెల్లడించారు. కశ్మీర్ నుంచి… వచ్చి న‌టాలియా లాహోర్ లో క్రికెట్ ఆడుతున్నట్లు వెల్లడించారు. నటాలియా పరిస్థితులు దారుణంగా ఉన్నాయని… చెప్పే ప్రయత్నంలో భాగంగా తన వ్యాఖ్యలు ఉన్నాయని సనా మిర్‌ వెల్లడించారు. ఇందులో ఎలాంటి తప్పుడు వ్యాఖ్యా లు లేవని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. తాను ఎలాంటి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌బోను అంటూ ఫైర్ అయ్యారు.

Advertisement

Also Read: Watch Video : పాక్ గ‌డ్డ‌పై జై హింద్ నినాదాలు.. అఫ్ఘానిస్తాన్ స్టూడెంట్స్ ర‌చ్చ రంబోలా..గూస్ బంప్స్ వీడియో

 

Advertisement

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×