E-Paper
Advertisement

WPL : ముంబై హ్యాట్రిక్.. ఢిల్లీకి షాక్..

WPL : ముంబై హ్యాట్రిక్.. ఢిల్లీకి షాక్..
Advertisement

WPL : మహిళల ప్రీమియర్ లీగ్ లో ముంబై హ్యాట్రిక్ విజయాలు సాధించింది. మూడో మ్యాచ్ లో బలమైన ప్రత్యర్థి ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ మెగ్ లానింగ్ ( 41 బంతుల్లో 5 ఫోర్లతో 43 రన్స్ ), జెమీమా రోడ్రిగ్స్ ( 18 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు ) మాత్రమే కాస్త రాణించారు. రాధా యాదవ్ (10 రన్స్) మినహా మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్ కే పెవిలియన్ చేరారు. దీంతో ఢిల్లీ జట్టు ముంబై ముందు 106 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిచింది. ముంబై బౌలర్లలో ఇస్సీ వాంగ్ , సైకా ఇసాక్ , హేలీ మథ్యూస్ తలో 3 వికెట్లు పడగొట్టి.. ఢిల్లీని కుప్పకూల్చారు. పూజా వస్త్రాకర్ కు ఒక వికెట్ దక్కింది.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకు ఓపెనర్లు యాస్తికా బాటియా ( 32 బంతుల్లో 8 ఫోర్లతో 41 రన్స్ ), హేలీ మథ్యూస్ ( 31 బంతుల్లో 6 ఫోర్లతో 32 రన్స్) మంచి ఆరంభాన్ని అందించారు. ఓపెనర్లు అవుట్ తర్వాత నాట్ స్కివర్ బ్రంట్ ( 19 బంతుల్లో 4 ఫోర్లతో 23 నాటౌట్), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ( 11 నాటౌట్ ) అదే జోరును కొనసాగించారు. దీంతో ముంబై కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 15 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 3 వికెట్లు పడగొట్టిన సైకా ఇషాక్ కు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Advertisement

WPLలో ముంబై జట్టుకు తిరుగు లేకుండా పోతోంది. ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ సునాయాసంగా విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్ ల్లో గెలిచి జోరుమీద ఉన్న ఢిల్లీ జట్టు కూడా ముంబై ముందు తలవంచింది. కనీసం పోటీ కూడా ఇవ్వకుండా చేతులేత్తేసింది. ఇక ఈ టోర్నిలో బెంగళూరు జట్టు ఇంతవరకు ఖాతా తెరవలేదు. ఆ జట్టు ఢిల్లీ, ముంబై , గుజరాత్ చేతిలో ఓడిపోయింది. గుజరాత్ రెండు మ్యాచుల్లో ఓడగా.. యూపీ ఒక మ్యాచ్ లో పరాజయం పాలైంది. ఈ రెండు జట్లు ఒక్కో విజయాన్ని నమోదు చేశాయి.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×