E-Paper
Advertisement

MS Dhoni: హైదరాబాద్ ఆటగాళ్లకు ధోనీ క్లాస్.. అలా కాదు ఇలా ఆడాలి..

MS Dhoni: హైదరాబాద్ ఆటగాళ్లకు ధోనీ క్లాస్.. అలా కాదు ఇలా ఆడాలి..
Advertisement

MS Dhoni: ఎంఎస్‌ ధోనీ.మిస్టర్‌ కూల్‌ స్కిప్పర్‌. మ్యాచ్‌ను గెలిపించడంలో ధోనీ ప్లాన్స్‌ అలగ్‌ ఉంటాయ్‌. వికెట్ల వెనకల ఉంటూనే.. మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగల కెప్టెన్సీ ధోనీ సొంతం. అలాంటి ధోనీ తరచుగా యువకులకు టెక్నిక్స్‌ నేర్పిస్తూ ఉంటారు. తాజాగా హైదరాబాద్‌- చెన్నై జట్ల మ్యాచ్‌ ముగిసిన తర్వాత ధోనీ యువకులకు క్లాసులు తీసుకున్నాడు. SRHలోని యువ బ్యాటర్లకు కొన్ని మెళుకువలను నేర్పించాడు. అటాకింగ్‌.. డిఫెన్స్‌ ఎలా ఆడాలో వివరించాడు. షాట్ సెలక్షన్‌ పైనా కూడా మిస్టర్‌ కూల్‌.. యంగ్‌స్టర్స్‌కు తర్పీదు ఇచ్చాడు.

అబ్దుల్‌ సమద్‌, అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌, రాహుల్‌ త్రిపాఠి, ఉమ్రాన్‌ మాలిక లాంటి ఆటగాళ్లు కూడా ధోనీ స్పీచ్‌ ను అలాగే వింటూ ఉండిపోయారు. ధోనీ టెక్నిక్స్‌ చెబుతుండగా.. SRH యంగ్‌ ప్లేయర్స్‌ అంతా కూడా చాలా కాన్‌సెన్ట్రేషన్‌ తో వింటున్నారు. ఇప్పుడీ ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌ గా మారాయి. ఈ ఫోటోలపై SRH ఫ్యాన్స్‌ సెటైరికల్‌ ట్వీట్స్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌ జట్టు ఆటగాళ్ల ప్రదర్శనలో పెద్దగా మార్పు ఉండదని విమర్శిస్తున్నారు. కనీసం సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ తో జరిగే మ్యాచ్‌లోనైనా మంచి స్కోరింగ్‌ చేయాలంటున్నారు.

Advertisement

ఈ మ్యాచ్ లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఓటమిపాలైంది. తొలుత టాస్‌ గెలిచిన చెన్నై.. బౌలింగ్‌ తీసుకుంది. దీంతో బ్యాటింగ్‌ కు దిగిన మార్కరం సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. ఆ తర్వాత స్వల్ప లక్ష్య చేధనలో భాగంగా చెన్నై జట్టు.. మూడు వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. చెన్నై ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ 35, కాన్వే 77 పరుగులతో అదరగొట్టారు. హైదరాబాద్‌ జట్టు ఆడిన6 మ్యాచుల్లో నాలుగింట్లో ఓడిపోయి.. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×