E-Paper
Advertisement

Tilak Varma: తిలక్ ముంబైకి పట్టిన దరిద్రమా..?

Tilak Varma: తిలక్ ముంబైకి పట్టిన దరిద్రమా..?
Advertisement

Tilak Varma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025లో భాగంగా సోమవారం రోజు వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ముంబై ఇండియన్స్ 12 పరుగులు తేడాతో పరాభవం పాలైంది. అయితే ఈ మ్యాచ్ లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నారు.

 

Advertisement

తిలక్ వర్మ హాఫ్ సెంచరీ తో రాణించినా ఓడిపోక తప్పలేదు. గత మ్యాచ్ లో లక్నో పై ముంబై జట్టు 12 పరుగుల తేడాతో ఓడిపోవడం గమనార్హం. ఆ మ్యాచ్ లో తిలక్ వర్మ “రిటైర్డ్ అవుట్” కావడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, కోచ్ మహేల జయవర్ధనే ఈ విషయంపై వివరణ ఇచ్చారు. ఇక ఇప్పుడు తిలక్ వర్మ హాఫ్ సెంచరీ సాధించడంతో మళ్ళీ ముంబై జట్టు మేనేజ్మెంట్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీనిపై హార్దిక్ పాండ్యా మళ్లీ స్పందించాడు. “ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ బాగా ఆడాడు. గత మ్యాచ్ లో ఎన్నో విషయాలు జరిగాయి. అవి బయట వ్యక్తులకు పెద్దగా తెలియవు. లక్నో మ్యాచ్ కి ముందు రోజు తిలక్ కి బంతి బలంగా తాకింది. రిటైర్డ్ అవుట్ గా ప్రకటించడం వెనక వ్యూహం ఉంది. కానీ తిలక్ వేలికి గాయమైంది నిజం. ఆ కారణంగానే అతడు దూకుడుగా ఆడలేకపోయాడు. కోచ్ నిర్ణయం మేరకు తిలక్ ని వెనక్కి పిలిపించి.. కొత్త బ్యాటర్ తో ఎటాక్ చేయించాలన్నది మా ప్లాన్.

Advertisement

ఇక కోలుకున్న తిలక్ వర్మ ఈరోజు అద్భుతంగా ఆడాడు” అని చెప్పుకొచ్చాడు హార్దిక్ పాండ్యా. ఇక ఈ మ్యాచ్ లో 29 బంతులలో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో తిలక్ వర్మ 56 పరుగులు చేశాడు. అయితే ఇక్కడే అసలు చర్చ మొదలైంది. తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేస్తే ముంబై జట్టు గెలిచిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. తిలక్ వర్మ ఐపిఎల్ లో హాఫ్ సెంచరీ చేస్తే.. ఏ మ్యాచ్ నీ కూడా ముంబై ఇండియన్స్ గెలవలేదు.

2022 ఐపీఎల్ నుండి 2025 ఐపీఎల్ వరకు ఉన్న లెక్కల ప్రకారం ఇది నిజం. తిలక్ పోరాడిన ప్రతి మ్యాచ్ లోను ముంబై ఇండియన్స్ జట్టు ఓడిపోయింది. వాంఖడే స్టేడియంలో ఆర్సిబితో సోమవారం రోజు రాత్రి జరిగిన మ్యాచ్ లోను తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్ లో కూడా ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే తన కెరీర్ లో ఇప్పటివరకు ఐపీఎల్ లో తిలక్ వర్మ ఏడు ఆఫ్ సెంచరీలు చేశాడు.

 

ఈ సీజన్ లో ఆర్సిబి పై తొలి హాఫ్ సెంచరీ చేయగా.. ఈ మ్యాచ్ కూడా ఓడిపోయింది ముంబై. 2022లో ఐపీఎల్ లో అడుగుపెట్టిన తిలక్ వర్మ ముంబై తరపున మాత్రమే ఆడుతున్నాడు. తొలి సీజన్ లో 397 పరుగులు చేసిన తిలక్.. 2023లో 343, 2024లో రోహిత్ శర్మ తర్వాత అత్యధిక పరుగులు {416} చేశాడు. తిలక్ వర్మ ఇప్పటివరకు చేజింగ్ లో ఏడుసార్లు హాఫ్ సెంచరీ చేయగా.. ముంబై ఒక్క మ్యాచ్ లోను గెలవలేదు. వీటిలో రెండేసి మ్యాచ్ లు ఆర్సిబి, రాజస్థాన్ రాయల్స్ పైనే ఓడిపోవడం గమనార్హం.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×