E-Paper
Advertisement

Manu Bhaker: మను భాకర్ ఇంట తీవ్ర విషాదం..!

Manu Bhaker: మను భాకర్ ఇంట తీవ్ర విషాదం..!
Advertisement

Manu Bhaker: పారిస్ ఒలంపిక్స్ 2024 పథక విజేత, భారత స్టార్ షూటర్ మను భాకర్ ఇంట విషాదం నెలకొంది. ఆదివారం రోజు తెల్లవారిజామున హర్యానాలోని చర్ఖి ధాత్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మను భాకర్ మేనమామ, ఆమె అమ్మమ్మ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. మహేంద్రఘడ్ బైపాస్ రోడ్డులో ఆదివారం ఉదయం 9 గంటలకు స్కూటర్, బ్రెజ్జా కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

Also Read: Abhinav Manohar: SRH చేతిలో మరో డేంజర్ ఆల్ రౌండర్.. క్యావ్యాపాప ప్లాన్ అదుర్స్ !

Advertisement

ఈ ప్రమాదంలో మను భాకర్ అమ్మమ్మ, మేనమామ మృతి చెందారు. ఇటీవలే రాష్ట్రపతి చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డును అందుకున్న ఆమెకు ఈ విషాద సంఘటన చేదుని మిగిల్చింది. వీరు స్కూటీపై ప్రయాణిస్తుండగా బ్రేజ్జా కారు వారిని ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం పంపించి.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. మను భాకర్ అమ్మమ్మ వయసు 70 సంవత్సరాలు కాగా.. ఆమె మేనమామ వయస్సు 50 సంవత్సరాలు.

ఆమె అమ్మమ్మ సావిత్రి దేవి కూడా జాతీయ స్థాయిలో పథకాలు సాధించి క్రీడలలో మంచి పేరు తెచ్చుకుంది. ఈ విషాద ఘటనతో మను భాకర్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మను భాకర్ సోషల్ మీడియా వేదికగా తన మామయ్య, అమ్మమ్మలకు నివాళులు అర్పించారు. ఈ విషాద ఘటన పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తనకి, తన కుటుంబానికి మద్దతు ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

పారిస్ ఒలంపిక్స్ 2024 ( Paris Olympics 2024) లో భారత్ కి తొలి పథకాన్ని అందించింది మను భాకర్. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో ఆమె కాంస్య పథకాన్ని గెలుచుకుంది. టీనేజర్ గా ఉన్నప్పటినుండే ఆమె షూటింగ్ లో రాణిస్తోంది. ఈమె 2022 ఫిబ్రవరి 18న జన్మించింది. పాఠశాలలో టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్ వంటి క్రీడలలో రాణించి.. 2016 రియో ఒలంపిక్స్ ముగిసిన తర్వాత 14 ఏళ్ల వయసులోనే తన పూర్తి దృష్టిని షూటింగ్ పై పెట్టింది.

Also Read: India Squad: గంభీర్ వర్సెస్ రోహిత్.. BCCI మీటింగ్ లోనే డిష్యూం..డిష్యూం !

స్పోర్ట్స్ షూటింగ్ పిస్టల్ కావాలని తండ్రి రామ్ కిషన్ బాకర్ ని కోరింది. దీంతో ఆమె తండ్రి కూడా వెంటనే పిస్టల్ కొనిచ్చారు. అప్పుడు ఆమె తీసుకున్న ఆ నిర్ణయమే ఇప్పుడు ఒలంపియన్ గా ప్రపంచం ముందు నిలిపింది. 2017లో జరిగిన జాతీయ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో మాజీ ప్రపంచ నంబర్ వన్ హీనా సిద్దు ని ఓడించింది మను. ఆ తర్వాత కామన్వెల్త్ తో పాటు పలు పోటీలలో పథకాలు సాధించింది. ఇలా జాతీయ క్రీడలలో ఎన్నో పథకాలు సాధించి మంచి పేరు తెచ్చుకున్న మను ఇంట నేడు తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×