E-Paper
Advertisement

MS Dhoni : ధోనీతోనే ఆటలా? .. ఐపీఎస్ అధికారికి జైలు శిక్ష

MS Dhoni  : ధోనీతోనే ఆటలా? .. ఐపీఎస్ అధికారికి జైలు శిక్ష
Advertisement
MS Dhoni news today

MS Dhoni news today(Latest sports news telugu):

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో ఆటలాడితే ఊరుకుంటాడా? అది ఐపీఎస్ అధికారైనా ఎవరైనా ఒకటే…తనపై నిందారోపణలు చేసిన అధికారిపై ధోనీ పరువు నష్టం కేసు వేశాడు. విచారించిన మద్రాస్ హైకోర్టు, ధోనీ ఎలాంటి పొరపాటు చేయలేదని తేల్చింది. అనుచితంగా మాట్లాడినందుకు ఆ అధికారికి 15రోజుల జైలు శిక్ష విధించింది. అయితే తీర్పును సవాల్ చేసేందుకు 30 రోజులు గడువిచ్చింది.

విషయం ఏమిటంటే.. 2013 ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలింది. దీంతో ఆ జట్టుపై రెండేళ్ల పాటు బీసీసీఐ నిషేధం విధించింది. ఇక్కడ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి.. ఫిక్సింగ్, బెట్టింగ్‌తో సంబంధాలు ఉన్నాయంటూ ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ వ్యాఖ్యానించారు.

Advertisement

దీనిపై మహేంద్ర సింగ్ ధోనీ 2014లో పరువు నష్టం కేసు వేశాడు. తాను అడిగే 17 ప్రశ్నలకు ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ సమాధానాలు చెప్పాలని అన్నాడు. ఏ ఆధారంతో తనపై ఫిక్సింగ్ ఆరోపణలు చేశాడో, చెప్పాలని కుండ బద్దలు కొట్టాడు.  ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు.. ధోనీ పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయద్దంటూ హెచ్చరించింది.

ధోనీ లాంటి వ్యక్తి కి సంబంధించి వార్తలు ప్రచురించే ముందు నిర్ధారించుకోవాలని, ఆ మాత్రం ప్రాథమిక సూత్రాలు పాటించకపోతే ఎలా? అంటూ టీవీ ఛానెల్ ను తలంటేసింది. ధోనీ పిటిషన్‌పై టీవీ ఛానెల్, ఐపీఎస్ అధికారి ఇచ్చిన సమాధానాలపై సంతృప్తి చెందని ధోనీ, ఇది కోర్టు ధిక్కారణ కింద చర్యలు తీసుకోవాలని కోరాడు.

Advertisement

దీంతో మరోసారి మద్రాస్ హైకోర్టు విచారించింది. ఐపీఎస్ అధికారి సంపత్‌కు 15 రోజుల జైలు శిక్ష విధించింది. అయితే 30రోజులు గడువు ఇచ్చింది. తనకి అభ్యంతరాలుంటే అప్పీలు చేసుకోవచ్చునని తెలిపింది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×