E-Paper
Advertisement

Karishma Kotak : స్టేడియంలోనే బట్టలు మార్చుకున్న యాంకర్.. వీడియో చూస్తే!

Karishma Kotak : స్టేడియంలోనే బట్టలు మార్చుకున్న యాంకర్.. వీడియో చూస్తే!
Advertisement

Karishma Kotak :  వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025లో ఫైనల్ లో పాకిస్తాన్ పై సౌతాఫ్రికా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఓవైపు డివిలీయర్స్ సెంచరీ అద్భుతమైతే.. మరోవైపు WCL యజమాని హర్షిత్ తోమర్ అకస్మాత్తుగా కరిష్మా కొటక్ మధ్య పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా WCL సీఈవో హర్షిత్ తోమర్.. రెండు రోజుల కిందట కరిష్మా కొటక్ కి ప్రపోజ్ చేశాడు. అంతేకాదు..  హర్షిత్ తోమర్ అకస్మాత్తుగా కరిష్మా కోటక్‌ను యాంకర్‌గా నియమించాలనే ప్రతిపాదనను చేయడంతో ఆమె ఆశ్చర్యపోయింది.  కొన్ని గంటల తర్వాత తోమర్ ఆమెతో కలిసి ఓ ఫొటో దిగాడు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వీడియో  వైరల్ అయింది.

Also Read : Vindhya Vishaka : సిరాజ్ కెరీర్ మొత్తం కష్టాలే.. తండ్రి చనిపోయినా మ్యాచ్ ఆడాడు.. ఇప్పుడు రియల్ హీరో అయ్యాడు

Advertisement

స్టేడియంలో కరిష్మా కి తోమర్ ప్రపోజ్.. 

ఫైనల్ మ్యాచ్ లో డివిలియర్స్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో 125 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. పాకిస్తాన్ ని చిత్తు చిత్తుగా ఓడించడంలో డివిలియర్స్ కీలక ఇన్నింగ్సే కారణం అని చెప్పవచ్చు. పాకిస్తాన్ మాజీ ఓపెనర్ షార్జిల్ ఖాన్ 44 బంతుల్లో 76 పరుగులు చేసి తన జట్టును 195/5 స్కోర్ కి పెంచాడు. కానీ డివిలియర్స్ దాడికి ఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. ఇక ఈ మ్యాచ్ ముగిసిన తరువాత టోర్నమెంట్ యజమాని తోమర్ ను యాంకర్ కొటక్ ఇంటర్వ్యూ చేసింది. WCL ముగింపును ఎలా జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నావని ఆమె ప్రశ్నించగా.. ఆమెకు ప్రపోజ్ చేశాడు తోమర్. ఈ సంఘటన జరిగిన వెంటనే తోమర్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు.. దానికి రెండు హార్ట్ ఎమోజీలతో క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

Advertisement

కరిష్మా డ్రెస్.. వీడియో వైరల్ 

ఇదిలా ఉంటే.. తాజాగా స్టేడియంలోనే మరో సంచలన సంఘటన చోటు చేసుకుంది. స్టేడియంలో ఉండగా.. కరిష్మా కటక్  డ్రెస్ కి సంబంధించిన జిప్ ఊడిపోయింది. దీంతో అక్కడ ఉన్న సిబ్బందితో జిప్ పెట్టించుకుంది. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడం విశేషం. WCL ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఛాంపియన్స్ జట్టు సెమీ పైనల్ నుంచి తప్పుకోవడంతో పాకిస్తాన్ జట్టు నేరుగా ఫైనల్ కి చేరుకుంది. దీంతో దక్షిణాఫ్రికా తో తలపడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఛేజింగ్ దిగిన సౌతాఫ్రికా ఏబీ డివిలియర్స్ విధ్వంసంతో మరో 19 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో జయబేరి మ్రోగించింది. టైటిల్ ను అండుకుంది. 41 ఏళ్ల ఏబీ డివిలియర్స్ ఈ టోర్నీలో విశేషంగా రాణించాడు. ఈ టోర్నోలో ఏకంగా మూడు సెంచరీలు చేశాడు. ఫైనల్ లోనూ 60 బంతుల్లో 120 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఒంటి చేతితో తన జట్టుకు టైటిల్ అందించాడు.

?igsh=eTA1cWFhbWIwY3Vh

?igsh=Nzl1bndhbGxxYWVt

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×