Raghu Sharma Letter: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో తాజాగా ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా తొలి మ్యాచ్ ఆడిన రఘు శర్మ ఓ వికెట్ తీశాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి వికెట్ తీసిన నేపథ్యంలో రఘు శర్మ చేసిన సెలబ్రేషన్స్ వైరల్ గా మారాయి. ముఖ్యంగా జై శ్రీరామ్ అని రాసి ఉన్న ఓ పేపర్ ముక్కను అందరికీ చూపిస్తూ, హాట్ టాపిక్ అయ్యాడు రఘు శర్మ. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో రఘు శర్మ ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏంటి అని సోషల్ మీడియాలో అందరూ చర్చి చేయడం మొదలుపెట్టారు.
ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ రెండు జట్లు కూడా భారీ స్కోర్ నమోదు చేశాయి. లక్నో 228 పరుగులు సాధించగా, ఆ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ అవలీలగా ఛేదించింది. 18 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ చేసింది. అయితే ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన రఘు శర్మ నాలుగు ఓవర్లు వేశాడు. ఈ సందర్భంగా 36 పరుగులు ఇచ్చిన రఘు శర్మ, ఓ వికెట్ కూడా పడుకుంటాడు. రఘువంషి వికెట్ తీసిన అనంతరం జై శ్రీరామ్ అని రాసి ఉన్న ఓ లెటర్ బయటకు తీసి అందరికి చూపిస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దాదాపు 15 సంవత్సరాలుగా ఇలాంటి మూమెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాను…
ఇన్ని సంవత్సరాలకు నా డ్రీమ్ నెరవేరింది.. ఈ అవకాశాన్ని ఇచ్చిన ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు అని రాసి ఉన్న లేఖను అందరికి చూపిస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు రఘు శర్మ. అలాగే ఈ లేఖలో జై శ్రీరామ్ అని కూడా రాశాడు. దీంతో ఈ లేఖ చూపించడం పైన సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్ ఆడుతున్న ప్లేయర్.. ఒక మతానికి సంబంధించిన ప్రచారాన్ని చేయకూడదని సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు జనాలు. ఇలాంటి చర్యల పట్ల కచ్చితంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి చర్యలు తీసుకోవాలని అంటున్నారు.
పంజాబ్ రాష్ట్రంలో పుట్టి పెరిగిన రఘు శర్మ, లెగ్ స్పిన్నర్ గా అవతరించాడు. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. అతని వయసు 33 సంవత్సరాలు అయినప్పటికీ ఎంతో కష్టపడి, ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. పంజాబ్, పుదుచ్చేరి, ఉత్తరాంఖడ్ లాంటి రాష్ట్రాల తరఫున ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. రూ. 30 లక్షలు పెట్టి రఘు శర్మను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకుంది.
Also Read: Islamabad United vs Hyderabad Kingsmen, Eliminator 2 PSLలో మరో అరాచకం.. డబ్బులు లేక ఆంటీలతో క్లీన్ చేయిస్తున్నారు, దొంగల్లా దూరేస్తున్నారు
A very painful 15 years
By divine mercy of Gorudev ended today. Thanks Mumbai Indians (Blue and Gold) for giving me this opportunity. Ever grateful."Jai Sri Ram🧿
A emotional message that Raghu Sharma wrote on the note, which he showed while celebrating after taking his first… pic.twitter.com/r4Xs6FDMWe
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 4, 2026