E-Paper
Advertisement

IPL Over PSL: రూ.37 వేలు త‌క్కువ జీతం తీసుకుని..PSL నుంచి IPLలోకి ఎంట్రీ ఇచ్చిన స్పెన్సర్ జాన్సన్

IPL Over PSL: రూ.37 వేలు త‌క్కువ జీతం తీసుకుని..PSL నుంచి IPLలోకి ఎంట్రీ ఇచ్చిన స్పెన్సర్ జాన్సన్
Advertisement

IPL Over PSL :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) అటు పాకిస్తాన్ సూపర్ లీగ్ ( Pakistan Super League) ఒకే సమయంలో ప్రారంభం కాబోతున్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ నుంచి చాలామంది విదేశీ క్రికెటర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. PSL కంటే ఐపిఎల్ లో ఎక్కువ డబ్బులు వస్తాయని చాలామంది ప్లేయర్లు వస్తూ ఉంటారు. కానీ ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్పెన్సర్ జాన్సన్ ( Spencer Johnson ) మాత్రం, పాకిస్తాన్ సూపర్ లీగ్ కంటే తక్కువ జీతం వచ్చినప్పటికీ ఐపిఎల్ 2026 లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడేందుకు అగ్రిమెంట్ చేయించుకున్నాడు స్పెన్సర్ జాన్సన్. దీంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ పరువు మరోసారి గంగలో కలిసిందని ఇండియన్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

Also Read: Shoaib Akhtar On PSL: అమ్మాయి-అబ్బాయి లేకుండా పెళ్లి చేస్తారా ? అభిమానుల‌ను నిషేధించ‌డంపై షోయ‌బ్ అక్త‌ర్ సీరియ‌స్

PSL నుంచి IPLలోకి ఎంట్రీ ఇచ్చిన స్పెన్సర్ జాన్సన్

Advertisement

ఐపీఎల్ అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ రెండు ఒకేసారి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో విదేశీ క్రికెటర్లు తెలివిగా వ్యవహరిస్తున్నారు. డబ్బుతో పాటు పేరు వచ్చే ఐపిఎల్ టోర్నమెంట్ లోకి వచ్చేస్తున్నారు. ముందుగా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కోసం పేర్లు నమోదు చేసుకొని, మంచి ధర వచ్చినప్పటికీ కూడా ఐపీఎల్ నుంచి అవకాశం వస్తే వదులుకోవడం లేదు. అయితే తాజాగా ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు స్పెన్సర్ జాన్సన్ కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ కు ఝ‌లక్ ఇచ్చాడు. పర్సనల్ కారణాలవల్ల తాను PSL ఆడబోనని చెప్పి ఇప్పుడు ఐపీఎల్ లోకి ఎంటర్ ఇస్తున్నాడు.

అంతేకాదు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో కంటే 37 వేల రూపాయల జీతం తక్కువ వచ్చినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చేస్తున్నాడు. నాథన్ ఎల్లిస్ స్థానంలో స్పెన్సర్ జాన్సన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. వాస్తవంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఆస్ట్రేలియా బౌలర్ స్పెన్సర్ జాన్సన్ ను 1.87 కోట్ల రూపాయలు పెట్టి క్వెట్టా గ్లాడియేటర్స్ ( Quetta Gladiators) కొనుగోలు చేసింది. అయితే ఐపిఎల్ లో మాత్రం 1.50 కోట్లు మాత్రమే ఇస్తానని ఆఫర్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్. అంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో 37 లక్షల రూపాయలు తక్కువ జీతం వస్తోంది. డబ్బులు తక్కువ వచ్చినప్పటికీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో ఆడేందుకు స్పెన్సర్ జాన్సన్ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు స్పెన్సర్ జాన్సన్ పేరు సోష‌ల్ మీడియాలో మారుమోగుతోంది. స్పెన్స‌ర్ జాన్స‌న్ తీసుకున్న నిర్ణ‌యంపై ఇండియ‌న్ ఫ్యాన్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Advertisement

Also Read: Suryakumar-chewing gums: ఒక్క రోజుకు 500 చూయింగ్ గ‌మ్స్..సూర్య కుమార్ కోసం బీసీసీఐ ఎన్ని ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తోందంటే ?

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×