E-Paper
Advertisement

IPL : ఇషాన్ , సూర్య విధ్వంసం.. పంజాబ్ పై ముంబై గెలుపు..

IPL : ఇషాన్ , సూర్య విధ్వంసం.. పంజాబ్ పై ముంబై గెలుపు..
Advertisement

IPL : 215 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు సునాయాసంగా చేధించింది. పంజాబ్ ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 214 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లివింగ్ స్టోన్ (82 నాటౌట్), జితేష్ శర్మ (49 నాటౌట్) చెలరేగడంతో కింగ్స్ జట్టు స్కోర్ 200 దాటింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (30), మధ్యూ షార్ట్ (27) పర్వాలేదనిపించే స్కోర్ చేశారు. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా 2 వికెట్లు, అర్షద్ ఖాన్ ఒక వికెట్ తీశారు. జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్ల వేసి 56 పరుగులు సమర్పించుకున్నాడు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకు రిషి ధావన్ వేసిన తొలి ఓవర్ లోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇషాన్ కిషన్ (75), గ్రీన్ (23) స్కోర్ పెంచేందుకు ప్రయత్నించారు. గ్రీన్ అవుటైన తర్వాత ఇషాన్ కు సూర్యకుమార్ యాదవ్ (66) తోడుకావడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఫోర్లు, సిక్సులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మూడో వికెట్ కు 9.1 ఓవర్లలో 116 పరుగులు జోడించారు. దీంతో ముంబై విజయం ఖాయమైపోయింది. కానీ ఒక ఓవర్ వ్యవధిలోనే ఇద్దరూ అవుట్ కావడంతో మ్యాచ్ పై ఉత్కంఠ పెరిగింది. అయితే టిమ్ డేవిడ్ (19 నాటౌట్), తిలక్ వర్మ (26 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో ముంబై మరో 7 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

Advertisement

పంజాబ్ బౌలర్లలో నాథన్ ఇల్లీస్ 2 వికెట్లు, అర్షదీప్ సింగ్, రిషి ధావన్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో అర్ష దీప్ సింగ్ ఘోరంగా విఫలమయ్యాడు. 3.5 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చాడు. అతడి బౌలింగ్ లో ముంబై బ్యాటర్లు 8 ఫోర్లు, నాలుగు సిక్సులు బాదారు. ఇషాన్ కిషన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×