E-Paper
Advertisement

CSK vs RCB: RCB రికార్డులు బద్దలు కొట్టిన చెన్నై.. 24 గంటల్లోనే!

CSK vs RCB: RCB రికార్డులు బద్దలు కొట్టిన చెన్నై.. 24 గంటల్లోనే!
Advertisement

CSK vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025లో భాగంగా నేడు మరో రాసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమరం నేడు చెపాక్ స్టేడియం వేదికగా జరగబోతోంది. ఐపీఎల్ లో అత్యధిక ప్రజాదారణ పొందిన చెన్నై సూపర్ కింగ్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఎదురుపడుతున్నాయి. ఈ రెండు మేటి జట్లు కావడంతో ఏ జట్టు గెలుస్తుందోనని క్రికెట్ అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Yograj Singh: రోజు 20 కిలోమీటర్లు రోహిత్ శర్మ పరిగెత్తాల్సిందే..!

Advertisement

ఈ సీజన్ ని ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయాలతో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే జోరును కొనసాగించాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి. ఓవైపు మాస్టర్ మైండ్, మిస్టర్ కూల్ ధోని. మరోవైపు ఫైర్ క్రాక్, ఫెయిర్ ప్లే విరాట్ కోహ్లీ. కెప్టెన్లు ఎవరైనా ఈ మ్యాచ్ మొత్తం వీళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది. ఐపీఎల్ 2024 లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది.

గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్ ఛాన్స్ ఉండడంతో ఇరుజట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగింది. హై టెన్షన్ మ్యాచ్లో విజయం ఆర్సిబిని వరించగా.. చెన్నై సూపర్ కింగ్స్ ఇంటిదారి పట్టింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో ఆర్సిబి సెలబ్రేషన్స్ తరస్థాయికి చేరుకున్నాయి. ఇక ఈ ఇరుజట్ల బలాబలాలు, గత మ్యాచ్ ల విశ్లేషణలను పరిశీలిస్తే.. ఐపీఎల్ చరిత్రలో చెన్నై – ఆర్సిబి మధ్య ఇప్పటివరకు 33 మ్యాచ్ లు జరిగాయి.

Advertisement

ఇందులో చెన్నై 21సార్లు విజయం సాధించగా.. ఆర్సిబి 11 విజయాలు మాత్రమే సాధించింది. మరొక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇక చెన్నై గడ్డపై 17 ఏళ్ల నుండి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. ఆర్సిబి చివరిసారిగా 2008 ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్ లో చెపాక్ గడ్డపై గెలుపొందింది. ఆ తర్వాత మళ్లీ గెలిచిందే లేదు. ఈ నేపథ్యంలో ఈ సీజన్ లోనైనా చెపాక్ గడ్డపై ఆర్సిబి గెలుస్తుందా..? అన్నది ఆసక్తికరంగా మారింది.

Also Read: Shardul Thakur: పడి లేచిన కెరటం… Un sold ప్లేయర్ నుంచి తోపు ఆటగాడిగా రికార్డ్ !

చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు జరగబోయే మ్యాచ్ కి స్పిన్నర్లు కీలకం కానున్నారు. చెన్నై తరపున రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్ ఉన్నారు. మరోవైపు బెంగుళూరు తరపున కృనాల్ పాండ్యా, లివింగ్ స్టోన్ లపై భారీ భారం ఉండబోతోంది. ఇక సోషల్ మీడియాలో ఇరుజట్ల అభిమానులు పోస్టులతో హోరెత్తిస్తున్నారు. గత 24 గంటలలో చెన్నైకి అనుకూలంగా 52%, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు 48% మంది మద్దతుగా నిలిచారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ని స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఏది ఏమైనా.. చివరికి మ్యాచ్ లో తమదే విజయం అని ఇరుజట్ల అభిమానులు పేర్కొంటున్నారు.

Tags

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×