E-Paper
Advertisement

IPL 2024 : ఐపీఎల్ 2024.. కొత్తవారిపై మోజు

IPL 2024 : ఐపీఎల్ 2024.. కొత్తవారిపై మోజు
Advertisement
IPL 2024 14

IPL 2024 : 2023లో రూ.50 లక్షలకి కూడా అమ్ముడుపోని శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మధుశంక వన్డే ప్రపంచకప్‌ 2023లో రాణించిన క్రీడాకారులపై ఫ్రాంచైజీలు ద్రష్టి పెట్టాయి. వివిధ విభాగాల్లో టాప్ 10లో ఉన్న ఆటగాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదులు కోకూడదని నిర్ణయించుకున్నాయి. వారిలో బౌలర్స్ లో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంక ఉన్నాడు.
తను వరల్డ్ కప్ లో 9 మ్యాచ్ లు ఆడి 21 వికెట్లు తీసుకున్నాడు. దురద్రష్టం ఏమిటంటే ఐపీఎల్ 2023లో రూ.50 లక్షలకి కూడా ఎవరూ కొనుక్కోలేదు.

మరి ఫ్రాంచైజీలు దిల్షాన్ మధుశంకలోని బౌలర్ ని గుర్తించలేదా? అందరిలాగే వీరు కూడా పైపై మెరుగులే చూస్తున్నారా? ఆ ఆటగాడి పూర్వాపరాలు తెలుసుకోవడం లేదా? మరి ఫ్రాంచైజీల దగ్గర మెంటర్లు, కోచ్ లు, ఎయిర్ పోర్టులో ఏరోప్లెయిన్ దగ్గర ఉన్నట్టు అంతమంది ఉండి కూడా మధుశంకలోని గొప్పతనాన్ని ఒక్కరూ గుర్తించలేదా? ఇది నిజంగా దురద్రష్టం అనే చెప్పాలి.

Advertisement

పదికి పది ఫ్రాంచైజీల పరిస్థితి అలాగే ఉండటం దారుణమని అంటున్నారు. అంటే ఐపీఎల్ అంతా డబ్బుల కోసం జరిగే గేమ్ తప్ప, ఏమీలేదు. జనం వీక్ నెస్ ల మీద డిపెండ్ అయి, ఆడే ఆటని అందరూ తిడుతున్నారు.

 ఎక్కడో అట్టడుగున ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే ఐపీఎల్ ని పెట్టామని ఘనంగా చెప్పుకునే బీసీసీఐ ఆ లక్ష్యానికి దూరంగా వెళ్లిపోతున్నట్టుగా అనిపిస్తోంది. ఫ్రాంచైజీలు కూడా ఇక్కడ స్టార్ బౌలర్, స్టార్ బ్యాటర్ అయితేనే కొంటున్నారు. లేదంటే ఇంతేసంగతి అని చెబుతున్నారు.

Advertisement

అంతేకానీ యువకుల్లో ప్రతిభను వెలికి తీద్దామనే ఆలోచన లేకపోవడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఈరోజున మధుశంక విషయంలో జరిగింది. రేపు మన ఇండియాలో కూడా జరుగుతుంది. అప్పుడు నిజమైన ఆటగాళ్లకి న్యాయం జరగదని అంటున్నారు.మళ్లీ ఆడాలి, మళ్లీ మళ్లీ ఆడాలి. పోరాడాలి, నిరూపించుకోవాలి…ఇక వర్థమాన క్రికెటర్ల పరిస్థితి ఇంతేనా అని ప్రశ్నిస్తున్నారు.

బౌలర్ గా మధుశంక కి డిమాండ్ పెరిగితే..బ్యాటింగ్ లోకి వచ్చేసరికి ఫైనల్ మ్యాచ్ లో టీమ్ ఇండియా విజయానికి అడ్డంగా నిలబడిపోయిన ట్రావిస్ హెడ్ కి మంచి ధర పలికేలా ఉంది.

ఇక ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, రచిన్ రవీంద్ర, డారీ మిచెల్ వంటి ప్లేయర్లు వేలంలో అందుబాటులో ఉండనున్నారు. వీరికి భారీ ధర పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా 50 మంది ఆటగాళ్లను దుబాయ్ వేదికగా డిసెంబర్‌ 19న జరిగే వేలంలో కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నట్లు అంచనా.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×