E-Paper
Advertisement

Inzamam-ul-Haq: బుమ్రా బౌలింగ్ పై ఇంజమామ్ ఆరోప‌ణ‌లు..బ్యాట్ లోనే కాదు బంతిలోనూ చిప్స్‌ పెట్టి, గెలిచారంటూ !

Inzamam-ul-Haq: బుమ్రా బౌలింగ్ పై ఇంజమామ్ ఆరోప‌ణ‌లు..బ్యాట్ లోనే కాదు బంతిలోనూ చిప్స్‌ పెట్టి, గెలిచారంటూ !
Advertisement

Inzamam-ul-Haq: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026) భాగంగా నిన్న కొలంబో వేదికగా పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఎన్నో అంచనాల నడుమ ఈ మ్యాచ్ జరగగా, ఇండియా అద్భుతంగా రాణించింది. దీంతో పాకిస్తాన్ పైన 61 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది టీం ఇండియా. ఈ మ్యాచ్ లో ఇండియా 176 పరుగుల టార్గెట్ పాకిస్తాన్ ముందు ఉంచింది. అయితే ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అట్టర్ ఫ్లాప్ అయింది పాకిస్తాన్. 18 ఓవర్లు ఆడిన పాకిస్తాన్.. 114 పరుగులు చేసి, ఆల్ అవుట్ అయింది. దీంతో టీమిండియా 61 పరుగులు తేడాతో విజయం సాధించింది.

Also Read: Sara Tendulkar: ఆంటీ అంటూ దారుణంగా ట్రోలింగ్‌.. క‌న్నీళ్లు పెట్టుకున్న సారా టెండూల్క‌ర్

పాకిస్తాన్ ఓటమిపై ఇంజమామ్ వుల్ హ‌క్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

Advertisement

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India vs Pakistan Match) మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq). అభిషేక్ శర్మ అలాగే ఇషాన్ కిషన్ ఇద్దరూ సంచలన బ్యాటింగ్ చేస్తే బ్యాట్లలో చిప్పులు ఉన్నాయని ప్రచారం చేశాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్. అయితే నిన్న ప్రేమ దాస స్టేడియం వేదికగా టీమిండియా గెలిస్తే.. మరో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకువచ్చాడు. టీమిండియా బౌలింగ్ చేసేటప్పుడు వాడిన బంతిలో చిప్ పెట్టారని.. బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందువల్లే టీం ఇండియా గెలిచిందని బాంబు పేల్చారు.

బాల్ టాంపరింగ్, చిప్ లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన నేపథ్యంలోనే బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టాడని సంచలన ఆరోపణలు చేశారు. వాస్తవంగా ప్రేమ దాస స్టేడియం స్పిన్నర్లకు అనుకూలిస్తుంది.. కానీ టీమిండియాలో మాత్రం హార్దిక్ పాండ్యా , బుమ్రా వికెట్లు తీయడం వెనుక పెద్ద కుట్ర కోణం ఉందని బాంబు పేల్చారు ఇంజమామ్ వుల్ హక్. బాల్ టాంపరింగ్ జరిగిన కారణంగానే ఇండియా గెలిచిందన్నారు. దీనిపై ఐసీసీ విచారణ చేపట్టాలని కోరారు ఇంజమామ్ వుల్ హక్. అయితే ఇంజమామ్ వుల్ హక్ చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫాన్స్ అదే స్టైల్ లో కౌంటర్ ఇస్తున్నారు.

ఎలిమినేషన్ టెన్షన్ లో పాకిస్తాన్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament)  నేపథ్యంలో పాకిస్తాన్ కు కొత్త టెన్షన్ మొదలైంది. ఇండియా చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ ఇంటిదారి పట్టే ప్రమాదం పొంచి ఉంది. ఫిబ్రవరి 18వ తేదీన నమిబియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోతే టోర్నమెంట్ నుంచి వైదొలగాల్సి వస్తుంది. అప్పుడు అమెరికా జట్టు సూపర్ 8లోకి ( Super 8) వెళుతుంది. ఇక నమీబియా పైన పాకిస్తాన్ గెలిస్తే ఈ టోర్నమెంట్లో సూపర్ 8లోకి వెళుతుంది.

Also Read: IND VS PAK: శివ‌రాత్రి నాడే కాళరాత్రి మిగిల్చారు..పాకిస్తాన్ దారుణ ఓట‌మి, సూప‌ర్ 8లోకి టీమిండియా

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×