E-Paper
Advertisement

Inzamam-ul-Haq: అంతా తొండాటే.. లైట్లు ఆపేసి, బ‌ల‌వంతంగా జై షానే పిచ్ మార్చేశాడు

Inzamam-ul-Haq: అంతా తొండాటే.. లైట్లు ఆపేసి, బ‌ల‌వంతంగా జై షానే పిచ్ మార్చేశాడు
Advertisement

Inzamam-ul-Haq:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) విజేతగా టీం ఇండియా నిలిచిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ జట్టు ను చిత్తుగా ఓడించిన టీమిండియా, ముచ్చటగా మూడవసారి టైటిల్ అందుకుంది. అయితే టీమిండియా చాంపియన్ అయినా నేపథ్యంలో పాకిస్తాన్ విషం కక్కడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా గెలిచేలా అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ మార్చేశారని ఆరోపణలు చేశారు. ఇన్నింగ్స్ మధ్యలో స్టేడియం లైట్స్ ఆఫ్ చేసి, జై షానే బలవంతంగా పిచ్ మార్చేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంజమామ్ వుల్ హక్. దీంతో ఇంజమామ్ వుల్ హక్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read: IND VS NZ Final: అహ్మ‌దాబాద్ మ‌ట్టిని నుదిటన రాసుకున్న సూర్య కుమార్, రోహిత్ శర్మను మించి సెల‌బ్రేష‌న్స్‌

లైట్లు ఆపేసి, బ‌ల‌వంతంగా జై షానే పిచ్ మార్చేశాడు..ఇంజామామ్ ఆరోప‌ణ‌లు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ విజేతగా టీం ఇండియా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రపంచ కప్ టీం ఇండియా గెలిచిన సందర్భంగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్ పిచ్ మార్చడం వల్ల ఫైనల్ లో టీం ఇండియా గెలిచిందని బాంబు పేల్చారు. విచ్ మార్చి ప్రపంచకప్ ఎలా గెలవాలో ఇండియాకు బాగా తెలుసు అని విమర్శలు చేశారు. ఇండియా బ్యాటింగ్ ఫినిష్ అయిన తర్వాత, లైట్స్ ఆపేసి.. పిచ్చి మార్చేసారని ఆరోపణలు చేశారు.

క్యూరేటర్ ను బెదిరించి మరీ, జై షానే ( ICC JAy Shah) ఇదంతా చేయించాడని మండిపడ్డారు. ఐసీసీ మొత్తం బీసీసీఐ ( BCCI) ఆధీనంలోనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే బీసీసీఐ, ఐసీసీ రెండు కుమ్మక్కై.. ఇండియా గెలిచేలా చేశాయని సంచలన ఆరోపణలు చేశారు ఇంజమామ్ వుల్ హక్. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ లో విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. ఐసీసీ అధ్యక్ష పదవి నుంచి జై షా తప్పుకోవాలని కూడా కోరారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఇంజమామ్ వుల్ హక్. దీంతో ఇంజమామ్ వుల్ హక్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

ముచ్చటగా మూడోసారి టైటిల్ గెలిచిన ఇండియా

Advertisement

అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్ జట్టును చిత్తు చేసిన టీమిండియా ముచ్చటగా మూడవసారి టైటిల్ అందుకుంది. 2007 సంవత్సరంలో మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీలో తొలిసారి టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ గెలుచుకుంది టీమిండియా. ఇక 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీ లో మరోసారి టైటిల్ దక్కించుకుంది. ఇక లేటెస్ట్ గా సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో ముచ్చటగా మూడోసారి టైటిల్ అందుకుంది ఇండియా. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.

Also Read: IND VS NZ Final: ముచ్చ‌ట‌గా మూడోసారి..టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విశ్వ విజేత‌గా టీమిండియా, ఫ్రైజ్ మ‌నీ ఎన్ని కోట్లంటే

 

 

 

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×