E-Paper
Advertisement

India women beat UAE-W: యూఏఈపై భారత్ ఘన విజయం.. బౌండరీలతో అదరగొట్టిన రిచా

India women beat UAE-W: యూఏఈపై భారత్ ఘన విజయం.. బౌండరీలతో అదరగొట్టిన రిచా
Advertisement

India women beat UAE-W by 78 Runs: మహిళల ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌లో టీమిండియా వరుసగా మరోసారి గెలిచింది. ఆదివారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు తీసింది. అయితే, టీ20ల్లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. అనంతరం బ్యాటింగ్ చేసిన యూఏఈ ఏడు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.

యూఏఈ జట్టులో కవిషా 40 పరుగులు తీసింది. అందులో 32 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్ తీసింది. రోహిత్ ఓజా (38 – 36 బంతుల్లో 1 సిక్స్, 5 ఫోర్లు), తీర్థ సతీష్ -4, రినిత -7, సమైరా ధరణిధర్క -5, ఖుషీ శర్మ -10, హీనా -8 పరుగలు తీశారు.

Advertisement

భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీప్తి శర్మ -2 వికెట్ల తీయగా, రేణుకా సింగ్, కన్వర్, పుజా వస్త్రాకర్, రాధ యాదవ్ తలో వికెట్ తీశారు.

Also Read: కోచ్ గౌతం గంభీర్ సహాయకులు వీరేనా?

Advertisement

టీమిండియా ప్లేయర్లు.. హర్మన్ ప్రీత్ కౌర్ (66 – 47 బంతుల్లో 1 సిక్స్, 7 ఫోర్లు), రిచా ఘోష్ (64- 29 బంతుల్లో 1 సిక్స్, 12 ఫోర్లు), ఓపెనర్ షఫాలీ వర్మ(37 – 18 బంతుల్లో 1 సిక్స్, 5 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (14), స్మృతి మంధాన (13) పరుగులు తీశారు. కాగా, భారత్ 4.2 ఓవర్లకే 52 పరుగులు చేసింది. తరువాత వరసుగా రెండు వికెట్లను కోల్పోయింది. వెంటనే రంగంలోకి దిగిన హర్మన్ ప్రీత్.. జెమీమాతో కలిసి జట్టును ఆదుకుంది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన రిచా ఘోష్ బౌండరీలతో అదరగొట్టింది.

యూఏఈ బౌలర్లు.. కవిషా 2 వికెట్లు తీయగా, హీనా, సమైర తలో వికెట్ పడగొట్టారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×