E-Paper
Advertisement

India vs West Indies: సంజూ ర‌ఫా..ర‌ఫా, వెస్టిండీస్ పై 10 ఏళ్ల రివేంజ్ తీర్చుకున్న టీమిండియా…సెమీ ఫైనల్ లోకి ఎంట్రీ

India vs West Indies: సంజూ ర‌ఫా..ర‌ఫా, వెస్టిండీస్ పై 10 ఏళ్ల రివేంజ్ తీర్చుకున్న టీమిండియా…సెమీ ఫైనల్ లోకి ఎంట్రీ
Advertisement

India vs West Indies: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament) భాగంగా ఆదివారం రోజున వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా ( India vs West Indies ) మధ్య సూపర్ 8 మ్యాచ్ జరిగింది. కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ లో విజయం సాధించిన టీమిండియా, నేరుగా సెమీ ఫైనల్ లో అడుగు పెట్టింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ( Eden Gardens, Kolkata) జరిగిన ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టును చిత్తు చేసింది టీమిండియా. చాలా రోజుల తర్వాత ఫామ్ లోకి వచ్చిన సంజు శాంసన్ 97 ప‌రుగులు చేసి, తన సత్తా ఏంటో చాటాడు. భయంకరమైన ఇన్నింగ్స్ ఆడి టీమ్ ఇండియాను సెమీ ఫైనల్ కు చేర్చాడు. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ 195 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని కేవలం 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది టీమిండియా. కేవ‌లం 19.2 ఓవ‌ర్ల‌లో వెస్టిండీస్ విధించిన ల‌క్ష్యాన్ని ఛేదించింది టీమిండియా. ఈ విజ‌యంతో సెమీస్ లోకి అడుగు పెట్టింది టీమిండియా.

Also Read: Fakhar Zaman : పాకిస్తాన్ తో శ్రీలంక మ్యాచ్ ఫిక్సింగ్‌..లైవ్ మ్యాచ్ లోనే అండంగా దొరికిపోయారు, ఇదిగో వీడియో

వెస్టిండీస్ పై పదేళ్ల రివెంజ్ తీర్చుకున్న టీమిండియా

Advertisement

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్ జట్టుపై కీలక మ్యాచ్ లో విజయం సాధించింది టీం ఇండియా. ఇందులో విజయం సాధించడమే కాదు తన పది సంవత్సరాల పగను తీర్చుకుంది సూర్య కుమార్ యాదవ్ సేన. 2016 సమయంలో టీ20 ప్రపంచ కప్ జరగగా.. అప్పుడు ముంబై వేదికగా వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియాను చిత్తు చేసి ఫైనల్ కు చేరుకుంది వెస్టిండీస్. అయితే అప్పటి పగను… పది సంవత్సరాల తర్వాత ఈడెన్ గార్డెన్స్ వేదికగా తీర్చుకుంది సూర్య కుమార్ యాదవ్ సేన. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా కనిపిస్తున్నారు.

సంజూ ర‌ఫా..ర‌ఫా, వెస్టిండీస్ పై 10 ఏళ్ల రివేంజ్ తీర్చుకున్న టీమిండియా

టి20 ప్రపంచక 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసి 195 పరుగులు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో టీమిండియా చేదించింది. దీంతో సెమీఫైనల్ లో అడుగు పెట్టింది సూర్య కుమార్ యాదవ్ సేన. అయితే చేజింగ్ లో టీమిండియా తరఫున బరిలోకి దిగిన సంజు శాంసన్ ఊచ కోత కోశాడు. ప్రతిసారి విఫలమవుతున్నాడని అందరూ అతన్ని పొడుస్తూ ఉంటే.. అసలు సిసలు మ్యాచ్ లో కాక రేపాడు. వెస్టిండీస్ పైన కేవలం 50 బంతుల్లోనే 97 పరుగులు సాధించాడు సంజు శాంసన్. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ.. ఏమాత్రం తగ్గలేదు. మహేంద్ర సింగ్ ధోని వారసుడిలా చెలరేగిపోయాడు సంజు. దీంతో చివరలో బౌండరీ కొట్టి మ్యాచ్ గెలిపించాడు. ఈ దెబ్బకు టీమిండియా సెమీ ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Advertisement

Also Read: US Israel Iran War: టీ20 వ‌రల్డ్ క‌ప్ పై వార్ ఎఫెక్ట్..గ‌జ గ‌జ వ‌ణికిపోతోన్న ప్లేయ‌ర్లు..రంగంలోకి ఐసీసీ

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×