E-Paper
Advertisement

India vs Pakistan football match : ఇండియా, పాకిస్థాన్ ఫుట్‌బాల్ మ్యాచ్.. ఒక టర్నింగ్ పాయింట్..!

India vs Pakistan football match : ఇండియా, పాకిస్థాన్ ఫుట్‌బాల్ మ్యాచ్.. ఒక టర్నింగ్ పాయింట్..!
Advertisement
India vs Pakistan football match

India vs Pakistan football match : ఇండియా, పాకిస్థాన్ మధ్య ఏ మ్యాచ్ జరిగినా.. ప్రేక్షకులలో ఆసక్తి మామూలుగా ఉండదు. అనుక్షణం ఉత్కంఠం అంటే ఏంటో ఆ మ్యాచ్ సమయంలోనే తెలుస్తుంది. కేవలం క్రికెట్ అనే కాదు.. ఏ స్పోర్ట్స్‌లో అయినా ఇండియా, పాకిస్థాన్ మధ్య యుద్ధం దాదాపు ఇలాగే జరుగుతుంది. ఇక తాజాగా జరుగుతున్న సాఫ్ ఛాంపియన్‌షిప్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లలో కూడా ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఒక సెన్సేషన్‌గా మిగిలిపోతుందని ప్రెజెంటర్స్ అన్నారు.

Advertisement

ఈరోజుల్లో ప్రతీ ఆటలో రాజకీయాలు అనేవి పెరిగిపోయాయి. ముఖ్యంగా క్రికెట్ లాంటి ఆటల్లో అయితే అవి మరింత ఎక్కువయ్యాయి. ఈ కారనంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లు ఏర్పాటు చేయడం కష్టంగా మారిపోయింది. అందుకే స్పోర్ట్స్ ఫ్యాన్స్ అంతా ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడు ఏ మ్యాచ్ జరుగుతుందా అని ఆసక్తిగా చూడడం మొదలుపెట్టారు. అలాంటి వారికి తాజాగా జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ ఫుట్‌బాల్ మ్యాచ్ ఫుల్‌గా ఎంటర్‌టైన్మెంట్‌ను అందించింది.

2014 తర్వాత ఇండియా వర్సెస్ పాకిస్థాన్ ఫుట్‌బాల్ మ్యాచ్ అనేది జరగలేదు. దీంతో ఇంత గ్యాప్ తర్వాత రెండు దేశాల మధ్య జరిగే ఈ ఫుట్‌బాల్ యుద్ధం ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు మరింత ఎక్కువ ఉత్కంఠగా చూశారు. బెంగుళూరులో ఈ మ్యాచ్ జరిగింది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో ఇండియా 101వ స్థానంలో ఉండగా.. పాకిస్థాన్ 195వ స్థానంలో ఉంది. 4-0 స్కోర్‌తో ఇండియా.. పాకిస్థాన్‌ను ఓడించి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది.

Advertisement

ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ పూర్తిగా ప్రేక్షకులను తృప్తిపరిచింది అంటూ నిపుణులు చెప్తున్నారు. క్రికెట్ మ్యాచ్‌ల విషయంలో ఇండియన్ స్పోర్ట్స్ ఫ్యాన్స్ నిరాశగా ఉన్న సమయంలో ఇండియాకు, పాకిస్థాన్‌కు మధ్య ఒక స్పోర్ట్స్ మ్యాచ్ జరగడం, అందులో ఇండియా గెలవడం అనేది చరిత్రలో గుర్తుండిపోయే విధంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడిప్పుడే ఫుట్‌బాల్ అనేది దేశ నలుమూలలా ఉన్న స్పోర్ట్స్ లవర్స్‌కు దగ్గర అవుతుండగా.. ఈ మ్యాచ్ అనేది ఫుట్‌బాల్ హిస్టరీలోనే టర్నింగ్ పాయింట్ అన్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×