E-Paper
Advertisement

Ind vs Eng, 5th T20I: నేడే చివరి టీ20…భారీ మార్పులతో టీమిండియా..షమీకి నిరాశే !

Ind vs Eng, 5th T20I: నేడే చివరి టీ20…భారీ మార్పులతో టీమిండియా..షమీకి నిరాశే !
Advertisement

Ind vs Eng, 5th T20I: ఇవాళ టీమిండియా ( Team India ) వర్సెస్‌ ఇంగ్లాండ్‌  ( England ) జట్ల మధ్య చిట్ట చివరి టీ20 మ్యాచ్‌ జరుగనుంది. ఈ మేరకు రంగం సిద్ధం అయింది. టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదవ టి20 మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియం ( Wankhede Stadium ) వేదికగా జరగనుంది. ఇవాళ సాయంత్రం 7:00 సమయంలో… ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మొదటి టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నట్లు.. నిపుణులు చెబుతున్నారు. బ్యాటింగ్ చేసిన జట్టు మొదట విజయం సాధించే ఛాన్స్ ఉంది.

Also Read: Rohit Sharma: పాస్ పోర్ట్ మర్చిపోయా…తన మతిమరుపుపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

Advertisement

అయితే ముంబైలోని వాంఖడే స్టేడియం లో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో…. టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ముగ్గురు రాణిస్తారని.. అంచనా వేస్తున్నారు. ఈ ముగ్గురికి ముంబై ( Mumbai )హోం గ్రౌండ్ కావడంతో… ఈ ముగ్గురు ప్లేయర్లు దుమ్ము లేపుతారని అంటున్నారు. ఐపీఎల్ లో ఈ ముగ్గురు ప్లేయర్లు ముంబైకి ఆడుతున్నారు. అందుకే వీరిపై అందరూ నమ్మకం ఉంచుతున్నారు.  అటు సూర్య కుమార్ యాదవ్ కూడా ఈ మ్యాచ్ లోనైనా ఫాంలోకి రావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

కాగా… నాలుగో టీ20లో 15 పరుగుల తేడాతో నిర్ణయాత్మక విజయాన్ని అందుకుంది టీమిండియా. ఈ తరుణంలోనే… ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. దీంతో తిరుగులేని 3-1 ఆధిక్యంలో నిలిచింది టీమిండియా. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా అలాగే… శివమ్ దూబే ఒక్కొక్కరు 53 పరుగులతో గణనీయమైన సహకారాన్ని టీమిండియాకు అందించారు. దీంతో… నాలుగో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో… ఇంగ్లాండ్‌ పోరాడి ఓడింది. 19.4 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది ఇంగ్లండ్. దీంతో నాలుగో టీ20లో 15 పరుగుల తేడాతో నిర్ణయాత్మక విజయాన్ని అందుకుంది టీమిండియా. ఈ మ్యాచ్‌ లో బెన్ డకెట్ 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శివమ్ దూబే స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన హర్షిత్ రాణా 33 పరుగులకు మూడు ముఖ్యమైన వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు.

Advertisement

 

Also Read: Chaiwala Dolly: ఏంట్రా ఇది… గ్రౌండ్ లోనే చాయ్ అమ్ముతున్న టీ మాస్టర్?

అంచనా వేసిన ప్లేయింగ్ XIలు

టీమిండియా: సంజూ శాంసన్( WC), అభిషేక్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ ©, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా

ఇంగ్లాండ్: ఫిల్ సాల్ట్(wk), బెన్ డకెట్, జోస్ బట్లర్ ©, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×