E-Paper
Advertisement

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ అర్థ‌సెంచ‌రీలు…60 హ‌ఫ్ సెంచ‌రీలు పూర్తి చేసిన‌ హిట్ మ్యాన్

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ అర్థ‌సెంచ‌రీలు…60 హ‌ఫ్ సెంచ‌రీలు పూర్తి చేసిన‌ హిట్ మ్యాన్
Advertisement
Rohit Sharma: ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడవ వన్డేలో రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. మొన్న అడిలైడ్ వేదికగా అర్థ సెంచరీ నమోదు చేసుకున్న రోహిత్ శర్మ ఇవాళ సిడ్నీలో కూడా రికార్డు సృష్టించాడు. ఇవాల్టి మ్యాచ్ లో అర్థ సెంచరీ చేసిన రోహిత్ శర్మ తన అంతర్జాతీయ క్రికెట్ లో 60 అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్న ప్లేయర్ గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఇవాళ్టి మ్యాచ్ లో అర్థ సెంచరీ నమోదు చేసుకున్న రోహిత్ శర్మ… సిడ్నీ మైదానంలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు. ప్ర‌స్తుతం రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ ఇద్ద‌రూ బ్యాటింగ్ చేస్తున్నారు. 28 ఓవ‌ర్లు ఆడిన టీమిండియా, ఒకే వికెట్ కోల్పోయి, 171 ప‌రుగులు చేసింది. అటు రోహిత్, విరాట్ కోహ్లీ భాగ‌స్వామ్యం కూడా 100 ప‌రుగులు దాటేసింది.

60 హ‌ఫ్ సెంచ‌రీలు పూర్తి

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటి వరకు 268 వన్డే మ్యాచ్ లో ఆడాడు. ఈ నేపథ్యంలోనే తన కెరీర్ లో 60 అర్థ సెంచరీలు నమోదు చేసుకున్నాడు. 32 సెంచరీలు ఇందులో ఉన్నాయి. అలాగే మూడు డబుల్ సెంచరీలు చేసుకున్న ఏకైక మొనగాడు రోహిత్ శర్మ కావడం విశేషం. టీమిండియాలో ఓపెనర్ గా పదే పదే రోహిత్ శర్మకు మాత్రమే అవకాశం వస్తుంది కాబట్టి, ఈ రేంజ్ లో రోహిత్ శర్మ రెచ్చిపోయాడని చెప్పవచ్చు. ఇక ఆస్ట్రేలియా గడ్డపై మొన్న రెండో వన్డేలో ఇవాళ మూడవ వన్డేలో అర్ధ సెంచరీలు నమోదు చేసుకున్నాడు.

సిడ్నీ వేదికగా రోహిత్ శర్మకు తిరుగులేని రికార్డులు

సిడ్నీ మైదానంలో రోహిత్ శర్మకు తిరుగులేని రికార్డులు ఉన్నాయి. గతంలో ఈ గడ్డపై అద్భుతంగా రాణించిన రోహిత్ శర్మ, ఇవాల్టి మ్యాచ్ లో కూడా రెచ్చిపోయాడు. ఇక సిడ్నీ వేదికగా రోహిత్ శర్మ ఆడిన గత ఐదు ఇన్నింగ్స్ లు పరిశీలిస్తే.. 50, 30,50, సెంచరీ ఇప్పుడు మరో అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు రోహిత్ శర్మ. ఇక తన అంతర్జాతీయ క్రికెట్లో సిడ్ని వేదికగా ఇదే ఆఖరి వన్డే కానుంది. మరో రెండేళ్ల లోపు ఎప్పుడైనా రోహిత్ శర్మ రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

విరాట్ కోహ్లీ కూడా అర్ధ‌సెంచ‌రీ

Advertisement

ఆస్ట్రేలియా పై ఇప్పటికే రోహిత్ శర్మ అర్థ సెంచరీ చేయగా, విరాట్ కోహ్లీ కూడా కాసేపటికి క్రితమే హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో 56 బంతుల్లో అర్థ సెంచ‌రీ న‌మోదు చేశాడు. ఇవాళ్టి మ్యాచ్ లో ఆచితూచి ఆడిన విరాట్ కోహ్లీ, అర్థ‌సెంచ‌రీ పూర్తి చేసుకుని, ఫామ్ లోకి వ‌చ్చేశాడు. దీంతో అంత‌ర్జాతీయ క్రికెట్ 75 అర్ధ‌సెంచ‌రీలు న‌మోదు చేసుకున్నాడు.

Also Read: Womens World Cup 2025: వ‌ర‌ల్డ్ క‌ప్ లో గుండు సున్నా…గంగ‌లో క‌లిసిన‌ పాకిస్తాన్ ప‌రువు..ఇక‌ ఇంటికి వెళ్లి గోధుమ పిండి పిసుక్కోండి

https://twitter.com/CricCrazyJohns/status/1982008921696202868

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×