E-Paper
Advertisement

BAN Vs IND: రెండు దేశాల మ‌ధ్య శ‌త్రుత్వం.. భారత్, బంగ్లాదేశ్ సిరీస్ ర‌ద్దు..!

BAN Vs IND: రెండు దేశాల మ‌ధ్య శ‌త్రుత్వం.. భారత్, బంగ్లాదేశ్ సిరీస్ ర‌ద్దు..!
Advertisement

BAN Vs IND: ఇండియా అలాగే బంగ్లాదేశ్ మధ్య పరిస్థితులు ఏ మాత్రం బాగాలేవు. ప‌చ్చి గ‌డ్డి వేస్తే భగ్గుమ‌నే ప‌రిస్థితులు ఉన్నాయి. రెండు దేశాల మధ్య రాజ‌కీయ ప‌ర‌మైన ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాని షేక్ హ‌సీనాకు మ‌ర‌ణశిక్ష ప‌డింది. దీని ఎఫెక్ట్ క్రికెట్ మ్యాచ్ ల‌పై ప‌డింది.ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే పురుషుల క్రికెట్ మ్యాచ్ సిరీస్ వాయిదా పడగా, ఇప్పుడు మరో సిరీస్ కు కూడా బ్రేక్ పడింది. టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య డిసెంబర్ మాసంలో 3 వన్డేలు, మూడు టి20 ల సిరీస్ జరగాల్సి ఉంది. అయితే రెండు దేశాల మధ్య దౌత్యపరమైన కారణాలవల్ల ఈ సిరీస్ వాయిదా పడినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి అధికారిక ప్రకటన కూడా ఇవాళ లేదా రేపు చేసే ఛాన్స్ ఉందట. దీంతో క్రికెట్ అభిమానులు నిరాశకు గురయ్యారు.

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సిరీస్ క్యాన్సిల్ ?

Advertisement

టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్ల మధ్య డిసెంబర్ మాసంలో జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్ వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. రెండు దేశాల మధ్య రాజకీయపరమైన, ఉద్రిక్తతల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ సిరీస్ ను వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ తో సిరీస్ కు తమకు పర్మిషన్ రాలేదని బిసీసీఐ వర్గాలు కూడా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ సిరీస్ వాయిదా పడితే డిసెంబర్ మాసంలో ప్రత్యామ్నాయంగా వేరే సిరీస్ కు ఏర్పాట్లు చేస్తామని బిసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. వాస్తవంగా భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య సిరీస్ జరిగి ఉంటే 3 వన్డేల తో పాటు మూడు టి20లు ఆడాల్సి వచ్చేది. ఇప్పుడు వాయిదా పడుతున్న నేపథ్యంలో, శ్రీలంక లాంటి జ‌ట్లతో మరో సిరీస్ ప్లాన్ చేసే పనిలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉందట.

అల్లర్లు చెలరేగే ప్రమాదం

బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాని షేక్ హ‌సీనాకు ( Sheikh Hasina) మ‌ర‌ణశిక్ష ప‌డింది. దీంతో ఆ దేశంలో అల్ల‌ర్లు చెల‌రేగే ఛాన్సులు ఉన్నాయి. గ‌తంలోనే అల్ల‌ర్లు జ‌రిగితే, బంగ్లాదేశ్ లోని హిందువుల‌కు చాలా న‌ష్టం జ‌రిగింది. కొంత‌మంది మ‌ర‌ణించారు. ఆ సమయంలో బంగ్లాదేశ్ ను వదిలి ఇండియాకు పారిపోయి వచ్చింది ప్రధాని షేక్ హసీనా. ఇక ఇప్పుడు ఆమెకు మరో శిక్ష పడుతున్న నేపథ్యంలో మళ్లీ బంగ్లాదేశ్ లో అల్లర్లు చెలరేగే ప్రమాదం పొంచి ఉందని నిఘవర్గాలు చెబుతున్నాయి. ఇక ఇలాంటి పరిస్థితులలో బంగ్లాదేశ్ లో టీమ్ ఇండియా మరణిస్తే, పరిస్థితి వేరే లాగా ఉంటుందని అంచనా వేస్తున్నారు బీసీసీఐ పెద్దలు. అల్లరిలో నడుమ టీమ్ ఇండియాను పంపిస్తే పెను ప్రమాదం జరిగే ఛాన్స్ లు కూడా ఉంటాయి. కాబట్టి ఈ సిరీస్ వాయిదా వేసుకోవడం మంచిదని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆలోచన చేస్తోంద‌ట‌.

Advertisement

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×