E-Paper
Advertisement

India vs England : ఇంగ్లండ్‌పై ఇండియాదే పైచేయి..

India vs England : ఇంగ్లండ్‌పై ఇండియాదే పైచేయి..
Advertisement

India vs England : T20 వరల్డ్ కప్ లో సెకండ్ సెమీస్ మ్యాచ్… ఇండియా, ఇంగ్లండ్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే… రెండు జట్లు భీకరమైన ఫామ్ లో ఉన్నాయి. సమఉజ్జీల మధ్య జరిగే పోరు ఎలా సాగుతుందో? ఎవరు గెలుస్తారో? చూసేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే భారత అభిమానులు మాత్రం… టీమిండియాదే విజయమని ధీమాగా ఉన్నారు. పాత రికార్డుల్నే దీనికి సాక్ష్యంగా చూపుతున్నారు.

T20 ఫార్మాట్లో ఇండియా-ఇంగ్లండ్ 22 సార్లు తలపడగా.. భారత్‌ 12 సార్లు, ఇంగ్లండ్‌ 10 విజయాలు దక్కించుకున్నాయి. ఇక T20 ప్రపంచకప్‌లో రెండు జట్లు 3 సార్లు తలపడగా… టీమిండియా 2 సార్లు, ఇంగ్లండ్‌ ఓసారి గెలిచాయి. ఈ గణాంకాలు పరిశీలిస్తే ఇంగ్లండ్ పై టీమిండియాదే పైచేయి అని… మ్యాచ్‌ జరిగే అడిలైడ్‌లో ఇంగ్లండ్‌ టీమ్ కు చెత్త రికార్డు ఉండటం కూడా… రోహిత్ సేనకు కలిసొస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. అడిలైడ్ లో ఇంగ్లండ్‌ 17 వన్డేలు ఆడగా.. కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఇదే మైదానంలో ఆడిన ఒకే ఒక T20 మ్యాచ్ లో… ఆస్ట్రేలియాపై అతికష్టమ్మీద గెలిచింది… ఇంగ్లండ్. అంతేకాదు… ఈ వరల్డ్ కప్ లో టీమిండియాకు అడిలైడ్ లో ఆడిన అనుభవం ఉంది. ఆ మ్యాచ్ లో బంగ్లాపై రోహిత్ సేన అద్భుత విజయం సాధించింది. కానీ… ఈ వరల్డ్ కప్ లో అడిలైడ్ లో ఇంగ్లండ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దాంతో… పరిణామాలన్నీ టీమిండియాకే అనుకూలంగా ఉన్నాయని, రోహిత్ సేనదే గెలుపని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Advertisement

ఇంగ్లండ్ తో మ్యాచ్ లో రోహిత్ సహా విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌, పాండ్యా చెలరేగి ఆడితే… భారీ స్కోరు ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బౌలింగ్ లో అర్షదీప్‌ సింగ్‌, మహ్మద్‌ షమీ, పాండ్యా, భువీతో పాటు అశ్విన్ కూడా అదరగొడుతున్నారని… అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు రెచ్చిపోతే… ఇంగ్లండ్ పై ఇండియా భారీ విజయాన్ని నమోదు చేసి ఫైనల్ చేరడం ఖాయమంటున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×