E-Paper
Advertisement

IND Vs NZ : రెండో టీ20లో భారత్ విజయం.. సిరీస్ ఆశలు సజీవం..

IND Vs NZ : రెండో టీ20లో భారత్ విజయం.. సిరీస్ ఆశలు సజీవం..
Advertisement

IND Vs NZ : టార్గెట్ 100 పరుగులే. కానీ చివరి ఓవర్ వరకు ఫలితం తేలలేదు. లక్నోలో ఉత్కంఠ భరితంగా సాగిన రెండో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై విజయం సాధించింది. 100 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శుభ్ మన్ గిల్ మరోసారి విఫలమై 11 పరుగులకే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ ( 19 పరుగులు) క్రీజులో నిలబడేందుకు ప్రయత్నించినా అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. ఆ వెంటనే రాహుల్ త్రిపాఠి ( 13 పరుగులు) ఔట్ కావడంతో టీమిండియా 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు వచ్చిన సుందర్ తో కలిసి సూర్యకుమార్ యాదవ్ కివీస్ బౌలర్లను అడ్డుకున్నాడు.

అయితే సుందర్ కూడా రనౌట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అప్పటి భారత్ స్కోర్ 70 పరుగులు . విజయానికి 33 బంతుల్లో 30 పరుగులు చేయాలి. సాధారణ పిచ్ పై అయితే ఈ స్కోర్ లెక్కేకాదు. కానీ లక్నో పిచ్ బౌలర్లకు పూర్తిగా సహకరించడంతో బ్యాటర్లు పరుగులు చేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. సింగిల్ తీయడమే గగనమైంది. ఈ సమయంలో కెప్టెన్ హార్థిక్ పాండ్యా , సూర్య కుమార్ యాదవ్ సింగిల్స్ తీసుకుంటూ జట్టును విజయం వైపు నడించారు. చివరి ఓవర్ ఐదో బంతికి సూర్యకుమార్ యాదవ్ బౌండరీ కొట్టి భారత్ కు విజయాన్ని అందించాడు. 31 బంతులు ఆడిన సూర్య 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. టీ20ల్లో విధ్వంసకర బ్యాటరైన సూర్య తాను ఎదుర్కొన్న 31వ బంతికి తొలి బౌండరీ కొట్టాడంటే పిచ్ ఎంత కఠినంగా ఉందో అర్థమవుతోంది. కెప్టెన్ హార్థిక్ పాండ్యా 15 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్ 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. కివీస్ బౌలర్లలో బ్రాస్ వెల్ , ఇష్ సోధి చెరో వికెట్ తీశారు. ఆ జట్టు 17 ఓవర్లు స్పిన్నర్లతోనే వేయించింది.

Advertisement

అంతకుముందు న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలింగ్ కు అనుకూలంగా ఉండటంతో భారత్ బౌలర్లు చెలరేగిపోయారు. తొలి 10 ఓవర్లలో 50 పరుగులే ఇచ్చి నలుగురు కివీస్ బ్యాటర్లను పెవిలియన్ కు చేర్చారు. ముఖ్యంగా స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, చాహల్, దీపక్ హుడా , కులదీప్ యాదవ్ తలో వికెట్ తీసి కివీస్ రెక్కలు విరిచారు. గత మ్యాచ్ లో ఘోరంగా విఫలమైన అర్ష్ దీప్ సింగ్ మళ్లీ గాడిలో పడ్డాడు. ఈ మ్యాచ్ లో పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా 2 వికెట్లు పడగొట్టాడు.కెప్టెన్ హార్థిక్ పాండ్యా ఓ వికెట్ తీశాడు. న్యూజిలాండ్ బ్యాటర్లలో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ చేసిన 19 పరుగులే అత్యధికం. ఏ బ్యాటర్ కూడా కనీసం 15 పరుగులు చేయలేకపోయాడు. దీంతో 20 ఓవర్లలో న్యూజిలాండ్ 8 వికెట్లు కోల్పోయి 99 పరుగులు మాత్రమే చేయగలిగింది.

క్రీజులో చివరి వరకు నిలిచి భారత్ కు విజయాన్ని అందించిన సూర్యకుమార్ యాదవ్ కు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో టీ 20 అహ్మదాబాద్ లో జరగనుంది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×