E-Paper
Advertisement

IND vs ENG 3rd Test : ఆ నలుగురి కోసం ఎదురుచూపులు.. మూడో టెస్ట్ జట్టు ఎంపిక ఆలస్యం?

IND vs ENG 3rd Test : ఆ నలుగురి కోసం ఎదురుచూపులు.. మూడో టెస్ట్ జట్టు ఎంపిక ఆలస్యం?
Advertisement
IND vs ENG 3rd Test

IND vs ENG 3rd Test (sports news today) : ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్ట్ ల సిరీస్ కోసం మొదటి రెండు టెస్ట్ లకి జట్టుని ఎంపిక చేసిన బీసీసీఐ మూడో టెస్ట్ కోసం ఎదురుచూస్తోంది. నిజానికి రెండో టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 6 తో ముగుస్తుంది. మూడో టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 15న మొదలై 19 వరకు జరుగుతుంది.

రెండో టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత, ఇక 9 రోజులే సమయం ఉంటుంది. ఈ సమయంలో జట్టుని ప్రకటించాల్సి ఉంటుంది. ఎందుకంటే రావల్సిన వాళ్లు ఇంకా నలుగురున్నారు. వారికోసం ఎదురుచూస్తున్నట్టుగా బీసీసీఐ తీరుని చూస్తే తెలుస్తోంది.

Advertisement

ఇంతకీ ఎవరా? నలుగురు? అంటే ఒకరు అందరికీ తెలిసిన విరాట్ కొహ్లీ, మిగిలిన ముగ్గురు గాయాలతో చికిత్స పొందుతున్న మహ్మద్ షమీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా. వీరిలో విరాట్ కొహ్లీ నుంచి ఇంకా సంకేతాలు రాలేనట్టుగా చెబుతున్నారు. తను మూడో టెస్ట్ ఆడతాడా? లేదా? అనేది సందిగ్ధంగానే ఉంది. అలాగే ఎన్ సీఏలో చికిత్స పొందుతున్న మిగిలిన ముగ్గురికి సంబంధించిన రిపోర్ట్ అందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన మూడు మ్యాచ్ లకి జట్టుని ఎంపిక చేస్తారని అంటున్నారు. వీరి సంగతి తేలిన తర్వాతే జట్టు ఎంపిక ఉంటుందని అంటున్నారు.

ప్రస్తుతం కీలకమైన నలుగురు ఆటగాళ్లు లేక టీమ్ ఇండియా గిలగిల్లాడుతోంది. కొత్తవారితో జట్టుని ముందుకు నడిపించలేక రోహిత్ శర్మ ఒత్తిడికి లోనవుతున్నాడు. ఇది తన బ్యాటింగ్ పై ప్రభావం చూపిస్తోంది. అంతేకాదు రెండో టెస్ట్ లో తను, బుమ్రా ఇద్దరే సీనియర్లు కనిపిస్తున్నారు. మిగిలిన వారంతా కుర్రజట్టే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో క్లిష్టమైన సమయంలో ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కోవడం వారి వల్ల కావడం లేదు. హైదరాబాద్ లో గెలవాల్సిన టెస్ట్ మ్యాచ్ ను, అందువల్లే ఓడిపోయారు.

Advertisement

ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం ఆటగాళ్లపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తోందనే విమర్శలు నెట్టింట వినిపిస్తున్నాయి. వారు ఆటలో ఒత్తిడినే కాదు, బయట నుంచి వచ్చే తిట్లను భరించాల్సి వస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×