E-Paper
Advertisement

IND Vs AUS : వరల్డ్ కప్ ఫైనల్.. 16.2 ఓవర్ల తర్వాత బౌండరీ .. కోహ్లీ అవుట్..

IND Vs AUS : వరల్డ్ కప్ ఫైనల్.. 16.2 ఓవర్ల తర్వాత బౌండరీ .. కోహ్లీ అవుట్..
Advertisement

IND Vs AUS : విరాట్ కోహ్లీ తన సూపర్ ఫామ్ ను కొనసాగించాడు. ఆస్ట్రేలియాపై వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లోనూ కింగ్ రాణించాడు. 81 పరుగులకే జట్టు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో జట్టును ఆదుకున్నాడు. క్రీజులో పాతుకుపోయి .. సింగిల్ తీస్తూ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. పిచ్ బౌలింగ్ కు అనూకూలంగా ఉండటంతో పరుగులు రావడం గగనమైంది. దీంతో విరాట్ సింగిల్స్ పైనే దృష్టి పెట్టాడు.

మరోవైపు కేఎల్ రాహుల్ నుంచి కోహ్లీకి మంచి సహకారం లభించింది. ఇద్దరూ కూడా వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు.దీంతో 16.2 ఓవర్ల పాటు ఒక్క బౌండరీ కూడా రాలేదు. 10వ ఓవర్ చివరి బంతికి శ్రేయాస్ అయ్యర్ బౌండరీ కొట్టిన తర్వాత చాలా సేపు బౌండరీ పడలేదు. చివరికి 26.2 ఓవర్ల వద్ద రాహుల్ .. మాక్స్ వెల్ బౌలింగ్ లో బౌండరీ కొట్టాడు. అంటే 98 బంతులపాటు టీమిండియా బ్యాటర్లు ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయారు.

Advertisement

రోహిత్ దూకుడుతో తొలి పది ఓవర్లలో రన్ రేట్ 8గా ఉంది. కానీ తర్వాత రన్ రేట్ పడిపోయింది. తొలి 10 ఓవర్లకు 80 పరుగులు చేసిన భారత్ రెండు వికెట్లు ( గిల్ , రోహిత్) కోల్పోయింది. 11-20 ఓవర్ల మధ్య 35 పరుగులు మాత్రమే వచ్చాయి. అదే సమయంలో మరో వికెట్ ( శ్రేయాస్ అయ్యర్ )కోల్పోయింది. 21-30 ఓవర్ల మధ్య 37 పరుగులు చేసిన టీమిండియా విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయింది. 10 ఓవర్ల తర్వాత పరుగులు చేయడం కష్టంగా మారింది. అంటే 120 బంతుల్లో 72 పరుగులు మాత్రమే వచ్చాయి. ఇందులో ఒకే ఒక్క బౌండరీ ఉంది.

స్కోర్ వేగంగా పెరుగుతున్న క్రమంలో కోహ్లీ ( 54, 63 బంతుల్లో 4 ఫోర్లు) ను ఆసీస్ కెప్టెన్ కమిన్స్ బౌల్డ్ చేశాడు. 4వ వికెట్ కు కోహ్లీ, రాహుల్ కలిసి 67 పరుగులు జోడించారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×