E-Paper
Advertisement

IND Vs AUS : నాగ్ పూర్ టెస్టులో భారత్ బౌలర్లు భళా.. కుప్పకూలిన ఆసీస్..

IND Vs AUS : నాగ్ పూర్ టెస్టులో భారత్ బౌలర్లు భళా.. కుప్పకూలిన ఆసీస్..
Advertisement

IND Vs AUS : ఆస్ట్రేలియాతో నాగ్ పూర్ లో జరుగుతున్న తొలిటెస్టులో భారత్ బౌలర్లు చెలరేగారు. ఆస్ట్రేలియా బ్యాటర్లకు పట్టపగలే చుక్కలు చూపించారు. తన తొలి ఓవర్ తొలి బంతికే ఆసీస్ కు మహమ్మద్ సిరాజ్ షాక్ ఇచ్చాడు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత ఓవర్ తొలి బంతికి షమి బౌల్డ్ చేయడంతో మరో ఓపెనర్ డెవిడ్ వార్నర్ పెవిలియన్ బాట పట్టాడు. అయితే లంచ్ లోపు మరో వికెట్ పడకుండా మార్నస్ లబుషేన్ , స్టివ్ స్మిత్ అడ్డుకున్నారు. దీంతో లంచ్ విరామ సమాయానికి ఆసీస్ రెండు వికెట్లు నష్టానికి 76 పరుగులు చేసింది.

స్పిన్నర్లు తిప్పేశారు..
లంచ్ తర్వాత భారత్ బౌలర్లు మరోసారి రెచ్చిపోయారు. తొలుత పేసర్లు షాకిస్తే ఈసారి స్పినర్లు ఆసీస్ బ్యాటర్ల పనిపట్టారు. ఆసీస్ స్కోర్ 84 పరుగుల వద్ద లబుషేన్ ( 49) అర్థ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అవుట్ అయ్యాడు. లబుషేన్ ను జడేజా బౌలింగ్ లో కీపర్ కేఎస్ భరత్ స్టంప్ చేశాడు. కెరీర్ లో తొలి టెస్టు ఆడుతున్న భరత్ కు ఇదే తొలి వికెట్ కావడం విశేషం. అదే స్కోర్ వద్ద మ్యాట్ రెన్షాను జడేజా డకౌట్ చేశాడు. ఈ రెండు వికెట్లు వరుస బంతుల్లో పడ్డాయి. ఆసీస్ స్కోర్ 109 పరుగుల వద్ద స్టివ్ స్మిత్ ( 37)ను జడేజా బౌల్డ్ చేయడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది.

Advertisement

కీపర్ అలెక్స్ క్యారీ ( 36) దాటిగా ఆడేందుకు ప్రయత్నించగా అశ్విన్ బోల్తా కొట్టించాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా అశ్విన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత తొలి టెస్టు ఆడుతున్న టాడ్ మర్ఫీ ( డకౌట్) జడేజాకు చిక్కాడు. దీంతో ఆసీస్ 173 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. చాలాసేపు క్రీజులో నిలబడిన పీటర్ హాండ్స్ కాంబ్ ( 31) ను జడేజా అవుట్ చేశాడు. ఇక అశ్విన్ చివరి వికెట్ తీయడంతో ఆసీస్ 177 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయింది.

భారత్ బౌలర్లలో జడేజా 5 , అశ్విన్ 3 వికెట్లు పడగొట్టారు. షమీ, సిరాజ్ కు తలో వికెట్ దక్కింది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×