E-Paper
Advertisement

WTC Points Table : ఇంగ్లాండ్ చేతిలో దారుణ ఓటమి.. WTC పాయింట్స్ టేబుల్ లో అట్టడుగున టీమిండియా.. ఏ జట్టు ఏ స్థానంలో ఉందంటే

WTC Points Table : ఇంగ్లాండ్ చేతిలో దారుణ ఓటమి.. WTC పాయింట్స్ టేబుల్ లో అట్టడుగున టీమిండియా.. ఏ జట్టు ఏ స్థానంలో ఉందంటే
Advertisement

WTC Points Table : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రారంభ మ్యాచ్ బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత ప్రస్తుతం ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ మధ్య జరుగుతున్నాయి. అయితే శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా శ్రీలంక డ్రా చేసుకుంది. దీంతో ఇరు జట్లకు 33.33 పాయింట్లు లభించాయి. ప్రస్తుతం కేవలం నాలుగు జట్లు మాత్రమే ఇప్పటి వరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఆడాయి. వీటిలో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. దీంతో భారత్ కి 0 పాయింట్లు రాగా.. ఇంగ్లాండ్ జట్టు కి 100 పాయింట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.

Also Read :  Goutham Gambhir: కోచ్ గా గంభీర్ పనికిరాడు.. అతని హయాంలో 5 దారుణమైన పరాజయాలు.. రంగంలోకి కొత్త కోచ్..BCCI భారీ స్కెచ్! 

Advertisement

అట్టడుగు స్థానంలో టీమిండియా..

ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండిస్ జట్లు ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పటివరకు శ్రీలంక, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఇండియా మాత్రమే మ్యాచ్ లు ఆడాడు. దీంతో ఈ నాలుగు జట్లతో పోల్చుకుంటే.. టీమిండియా అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ తో పేలవ ప్రదర్శనతో టీమిండియా దారుణంగా ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ లో జరిగిన తొలి టెస్టులో భారత ఓటమికి ఫీల్డింగ్ వైఫల్యమే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. భారత ఆటగాళ్లు మొత్తం 6 క్యాచ్ లు జారవిడిచారు. అందులో ఓపెనర్ జైస్వాల్ 4 క్యాచ్ లు విడిచిపెట్టడం గమనార్హం. చేతిలోకి వచ్చినటువంటి క్యాచ్ లను కూడా అతనడు నేలపాలు చేశాడు. అయితే మ్యాచ్ సందర్భంగా బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేసిన సమయంలో అతను డ్యాన్స్ చేసి వీడియో పై భారత అభిమానులు మండిపడుతున్నారు. క్యాచ్ లు వదిలేసి ఇంత హ్యాపీగా ఎలా డ్యాన్స్ చేస్తున్నావు అంటూ ప్రశ్నిస్తున్నారు.

Advertisement

టీమిండియా లోయర్ ఆర్డర్ పేలవ ప్రదర్శన.. 

తొలి ఇన్నింగ్స్ భారత బ్యాటర్లు యశస్వి జైస్వాల్, శుబ్ మన్ గిల్, రిషబ్ పంత్ సెంచరీలు చేయగా.. రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ సెంచరీలు చేశారు. కానీ తొలి ఇన్నింగ్స్ లో చివరి 7 వికెట్లు 41 పరుగుల తేడాతో కోల్పోతే.. రెండో ఇన్నింగ్స్ చివరి 6 వికెట్లు 31 పరుగుల తేడాతోనే కోల్పోవడం గమనార్హం. తొలి నలుగురు, ఐదుగురు బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తే.. చివరి ఐదుగురు ఆటగాళ్లు చేతులెత్తేయడంతో టీమిండియా టపా టపా వికెట్లు కోల్పోయి.. ఓటమి పాలైంది. దీనికి తోడు బౌలింగ్ కూడా కట్టుదిట్టంగా చేయకపోవడంతో టీమిండియా కి షాక్ లు తప్పడం లేదు. ఇంగ్లాండ్ జట్టు 1 మ్యాచ్ లో విజయం సాధించి టాపర్ గా నిలిస్తే.. భారత జట్టు ఒక్క మ్యాచ్ లో మాత్రమే ఓడిపోయి చిట్ట చివరి స్థానానికి పడిపోవడం గమనార్హం. మిగతా జట్లన్ని పాల్గొంటే.. పాయింట్ల పట్టిక రూపురేఖలు అన్ని ఒక్కసారిగా మారిపోతాయి.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×