E-Paper
Advertisement

Rohit Sharma: సర్ఫరాజ్ కోసమే జడేజాను ముందుకు తెచ్చాం: రోహిత్

Rohit Sharma: సర్ఫరాజ్ కోసమే జడేజాను ముందుకు తెచ్చాం: రోహిత్
Advertisement
Rohit Sharma About IND Vs ENG 3rd Test

Rohit Sharma about India Vs England 3rd Test: అత్యంత భారీ తేడాతో టీమ్ ఇండియా రికార్డ్ విజయం సాధించింది. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఈసారి మూడో టెస్టులో ఊహించని ఎన్నో ట్విస్టులు జరిగాయని అన్నాడు. వాటన్నిటిని అధిగమించి ఇంత భారీ విజయాన్ని సాధించడం గొప్పగా ఉందని అన్నాడు. టెస్టు క్రికెట్ ఆడుతున్నామంటే రెండుమూడు రోజుల్లో ముగిసిపోదని అన్నాడు.

మొదట ఇంగ్లండ్ బాగా ఆడింది. మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టింది. నిజానికి రెండో  రోజు ఆట ముగిసే సమయానికి, రెండు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. మ్యాచ్ చేజారిపోతుందని అనుకున్నాం. కానీ మన బౌలర్లు గొప్పగా ఆడి సత్తాచాటారు. మనవారి బౌలింగ్ పట్ల ఎంతో గర్వంగా ఉందని అన్నాడు.

Advertisement

నిజానికి 33 పరుగులకు 3 వికెట్లు పడిపోయి క్లిష్టదశ నుంచి మొదట బయటపడ్డామని అన్నాడు. అక్కడ దొరికిన పట్టుని ఇంగ్లాండ్ చేజార్చుకుందని తెలిపాడు. అప్పుడు జడేజాని ఐదో స్థానంలో తీసుకురావడం మేలు చేసిందని తెలిపాడు. తనెంతో అనుభవజ్నుడైన ఆటగాడు. అదే సర్ఫరాజ్‌ని ముందుకు తీసుకువస్తే, ఈ ఒత్తిడిలో వికెట్ పారేసుకుంటాడని అనిపించింది.

Read More: 577 టెస్టుల చరిత్ర.. భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం..

Advertisement

అంతేకాదు తను క్లాస్ బ్యాట్స్‌మెన్, అందుకే తనకన్నా ముందు రవీంద్ర జడేజాని తీసుకొచ్చామని తెలిపాడు. ఆ వ్యూహం ఫలించింది. తర్వాత సర్ఫరాజ్ ఎలా ఆడాడో అందరూ చూశామని అన్నాడు.

ఆ తర్వాత మరో క్లిష్టమైన స్థితి అశ్విన్ జట్టులో లేకపోవడమని తెలిపాడు. నిజానికి నలుగురు బౌలర్లతో టెస్ట్ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్ అంతా నడిపించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని అన్నాడు. అందుకే టీమ్ ఇండియా ఆటగాళ్లందరినీ ముందు ప్రశాంతంగా ఉండమని తెలిపామని అన్నాడు.

ముఖ్యంగా బౌలర్లని ఉద్దేశించి, ఏం టెన్షను పడొద్దు, అంతా సర్దుకుంటుందని టీమ్ మేనేజ్మెంట్ చెప్పడంతో వారు ధైర్యంగా బౌలింగ్ చేసి, ఇంగ్లాండ్‌ని త్వరగా ఆలౌట్ చేశారని అన్నాడు. అన్నింటికన్నా ముఖ్యం టాస్ గెలవడమని అన్నాడు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్ బ్యాటింగ్‌కి వచ్చేసరికి బాల్ టర్న్ అవుతుందని ముందే ఊహించామని అన్నాడు.

అదే జరిగింది.. ఇంగ్లాండ్ అతి తక్కువ స్కోరుక 122కి ఆల్ అవుట్ అయ్యిందని చెప్పుకొచ్చాడు. మొత్తానికి టీమ్ ఇండియా ఆటగాళ్లందరూ అద్భుతంగా ఆడారని కొనియాడాడు. 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×