E-Paper
Advertisement

Hardik Pandya : ముంబై గూటికి హార్దిక్‌ పాండ్యా .. కోట్లలో డీల్..

Hardik Pandya :  ముంబై గూటికి హార్దిక్‌ పాండ్యా .. కోట్లలో  డీల్..
Advertisement
Hardik Pandya

Hardik Pandya : ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి సంబంధించి అప్పుడే సందడి మొదలైంది. ఎందుకంటే ఏ క్రికెటర్లు వస్తున్నారు? ఎవరు వెళుతున్నారనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా విషయంలో ఏం జరగబోతోంది. ఫ్రాంచైజీలు ఆటగాళ్లను మార్చుకుంటారా? జట్టులో ఇన్ బ్యాలెన్స్ ను సరిచేసుకుంటారా? అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

 హార్దిక్ పాండ్యా ఏడేళ్లు ముంబయి జట్టు తరఫున ఆడాడు. వాళ్లు సడన్ గా మాకొద్దన్నారు. గుజరాత్ టైటాన్స్ వాళ్లు తీసుకుని కెప్టెన్ చేశారు. దాంతో హార్దిక్ ఏకంగా కప్ తీసుకొచ్చేశాడు. ఇప్పుడు హార్దిక్ లేని లోటు ముంబయిలో స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్లకి సమర్థుడైన ఒక ఆల్ రౌండర్ కావాలి. అంతేకాదు హార్దిక్ పాండ్యా భావి భారత టీమ్ ఇండియా కెప్టెన్ అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. రోహిత్ శర్మకి వయసైపోతోంది. ప్రాక్టికాలిటీ బోధపడేసరికి చేతిలో ఉన్న వజ్రం చేజారిపోయింది.

Advertisement

ఇప్పుడు తత్వం బోధపడింది. ఈ నేపథ్యంలో హార్దిక్ కి బహుశా ముంబయి ఇండియన్స్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. అది నచ్చి హార్దిక్ ముంబయిలో చేరేందుకు ఆసక్తి చూపించారని అంటున్నారు. అయితే గుజరాత్ టైటాన్స్ కి హార్దిక్ ని పంపడం ఇష్టం లేదు. కానీ ఇక్కడ ఆటగాడిగా ఉండి మనస్ఫూర్తిగా ఆడకపోయినా ప్రమాదమే కాబట్టి, తను వెళతానంటే వెళ్లమన్నట్టు చెప్పినట్టు సమాచారం. తనకి లాభం వస్తే కాదనడానికి మనం ఎవరం అని వదలడానికి సిద్ధపడినట్టు వార్తలు వస్తున్నాయి.

హార్దిక్ పాండ్యా విషయంలో ముంబై ఇండియన్స్ జట్టు గుజరాత్‌ టైటాన్స్‌కు 15కోట్లు చెల్లించనుందని వార్తలు వస్తున్నాయి.  అలాగే ఈ మొత్తానికి అదనంగా ట్రాన్స్‌ఫర్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుందనీ, ఆ మొత్తంలో సగం హార్దిక్ పాండ్యాకు చెల్లిస్తారని తెలిసింది. మిగిలిన సగం గుజరాత్ టైటాన్ ఖాతాలోకి వెళతాయని అంటున్నారు. ఆ డబ్బులతో వాళ్లు మరో ముగ్గురి ఆటగాళ్లను కొనుక్కోవచ్చునని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే ఐపీఎల్ లోనే అతి పెద్ద డీల్ గా ఇది ఉంటుందని అంటున్నారు.

Advertisement

కెప్టెన్లను వదిలించుకున్న ఫ్రాంచైజీల్లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఉన్నాయి. 2020 సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు సారథిగా వ్యవహరించిన రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ట్రేడ్ ప్రక్రియలో సొంతం చేసుకుంది. ఆ తర్వాత కూడా మరో జట్టు కెప్టెన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా ఉన్న అజింక్య రహానేను సొంతం చేసుకుంది.

ఇలా ఒకే ఏడాది రెండు జట్ల కెప్టెన్లను సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ అదిరే ప్రదర్శన చేసింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. కానీ తుది పోరులో 2020లో ముంబయి ఇండియన్స్ చేతిలో ఓడి.. రన్నరప్‌గా నిలిచింది.

ఇప్పుడు ముంబయి, గుజరాత్ ఫ్రాంచైజీల మధ్య హార్దిక్ పాండ్యా విషయం ఎంతవరకు వచ్చిందనేది పెద్ద ప్రశ్నగా ఉంది. ఈసారి ఐపీఎల్ వేలంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×