E-Paper
Advertisement

IPL : గుజరాత్ జోరు.. ముంబై చిత్తు..

IPL : గుజరాత్ జోరు.. ముంబై చిత్తు..
Advertisement

IPL Match Updates(GT vs MI): ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జోరు కొనసాగుతోంది. తాజాగా ఆ జట్టు ముంబై ఇండియన్స్ ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ (56), డేవిడ్ మిల్లర్ (46), అభినవ్ మనోహర్ (42) చెలరేగడంతో గుజరాత్ భారీ స్కోర్ చేసింది. చివరిలో రాహుల్ తెవాటియా (20, 5 బంతుల్లో 3 సిక్సులు) మెరుపులు మెరిపించడంతో టైటాన్స్ స్కోర్ 200 దాటింది. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా 2 వికెట్లు, అర్జున్ టెండూల్కర్, బెరెన్ డార్ఫ్ , మెరిడిత్, కుమార్ కార్తికేయ తలో వికెట్ తీశారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఆది నుంచి తడబడింది. కెప్టెన్ రోహిత్ (2), ఇషాన్ కిషన్ (13), తిలక్ వర్మ (2), టిమ్ డేవిడ్ (0) విఫలం కావడంతో 59 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పరాజయం ఖాయం చేసుకుంది. గ్రీన్ (33), సూర్యకుమార్ (23), నేహల్ వదేర (40) కాసేపు మెరుపులు మెరిపించి స్కోరును పెంచారు. ఈ మ్యాచ్ ద్వారా తొలిసారిగా బ్యాటింగ్ చేసే అవకాశాన్ని దక్కించుకున్న అర్జున్ టెండూల్కర్ ఒక సిక్సర్ బాదాడు. 9 బంతుల్లో 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 20 ఓవర్లు ముగిసే సరికి ముంబై 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో గుజరాత్ జట్టు 55 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Advertisement

గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ రెండేసి వికెట్లు తీశారు. హార్ధిక్ పాండ్యాకు ఒక వికెట్ దక్కింది. బ్యాటింగ్ లో అదరగొట్టిన అభినవ్ మనోహర్ కు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 7 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించిన హార్ధిక్ సేన పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ముంబై 7 మ్యాచ్ ల్లో 3 విజయాలతో 7 స్థానంలో ఉంది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×