E-Paper
Advertisement

Gavaskar On RCB : 18 ఏళ్లు ఏం పీకారు? బెంగళూరు తొక్కిసలాటపై గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు

Gavaskar On RCB : 18 ఏళ్లు ఏం పీకారు? బెంగళూరు తొక్కిసలాటపై గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు
Advertisement

Gavaskar On RCB : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2025 ఐపీఎల్ సీజన్ టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ జట్టు పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ  సందర్భంగా చిన్న స్వామి స్టేడియంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ విజయోత్సవ వేడుకల్లో జరిగిన తొక్కిసలాట కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట గురించి భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ఆర్సీబీ అభిమానులు తమ ప్రాణాలను కోల్పోవడం ‘హృదయ విదారకంగా’ ఉందని అన్నారు. తమ అభిమాన జట్టు ట్రోఫీని ఎగురవేసేందుకు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోవడం అర్థం చేసుకోదగినది అని.. దానికి ఎవరికైనా నిందించడం ఇప్పుడు వ్యర్థ్యం అని పేర్కొన్నాడు.

Also Read : Watch Video : ఈ బుడ్డోడు ఏంట్రా.. బుమ్రానే మించిపోయాడు.. ఆ యార్కర్ కు వికెట్ ఎగిరిపోయిందిగా

Advertisement

చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట కారణంగా ప్రాణాలు కోల్పోవడం నిజంగా నిజంగా హృదయ విదారకంగా  ఉందని గవాస్కర్ తెలిపాడు. ముఖ్యంగా ఆ ప్రజలు కోరుకునేది సంవత్సరాలుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ సాధించలేదని.. గత రెండు నెలల నుంచి తమకు చాలా సంతోషం, ఆనందం కలిగించిందని తెలిపారు. అయితే కొంత మంది చనిపోవడం.. మరికొంత మంది గాయపడటం, ఆసుపత్రిలో చికిత్స పొందడం ఓ విషాదకరమైన ఘటన అన్నారు. ఇందులో ఎవ్వరినీ నిందించినా ప్రయోజనం లేదని.. జీవితాలను తిరిగి తీసుకురాలేము.. కొన్ని గాయాలు ఎప్పటికీ సరిగ్గా నయం కావని.. మానసికమైనవని తెలిపారు. మరోవైపు ఆర్సీబీ విక్టరీ సెలబ్రేషన్స్ సందర్భంగా బెంగళూరులో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పై బీసీసీఐ కూడా ఇటీవలే స్పందించింది. ముఖ్యంగా సెలబ్రేషన్స్ సరిగ్గా ప్లాన్ చేసి ఉండాల్సింది అంటూ ఆర్సీబీ మేనేజ్ మెంట్ పై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది.

వాస్తవానికి 18 సంవత్సరాల తరువాత ఆర్సీబీ తొలిసారిగా ఐపీఎల్ గెలిచినందున బెంగళూరులో ఇది చిరస్మరణీయమైన రోజుగా భావించారు. కానీ వేడుకలు విషాదాన్ని మిగిల్చాయి. ఛాంపియన్ జట్టును వీక్షించేందుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల దాదాపు 2 లక్షల మంది అభిమానులు గుమిగూడారు. పోలీసులు భారీ జనసమూహాన్ని నియంత్రించలేకపోయారు. దీంతో తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ఇది చాలా దురదృష్టకరం. ప్రజలు క్రికెటర్ల పట్ల పిచ్చిగా ఉన్నారు. అసలు ఇంత పెద్ద విజయోత్సవ వేడుకలను నిర్వహించేటప్పుడు సరైన జాగ్రత్తలు, భద్రతా చర్యలు తీసుకోవాలి. ఎక్కడో కొన్ని లోపాలు ఉన్నాయి. ఐపీఎల్ ఇంత అద్భుతంగా ముగిసిన తరువాత ఇది యాంటీ క్లైమక్స్ అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై, కోల్ కతా వంటి జట్లు గెలిచినప్పటికీ విజయోత్సవ సంబురాలు పలు జాగ్రత్తలతో జరుపుకున్నార. పద్దెనిమిదేళ్ల తరువాత టైటిల్ సాధించడం.. బెంగళూరులో విరాట్ కోహ్లీ అభిమానులు భారీగా తరలిరావడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందని పలువురు పేర్కొనడం విశేషం. 

Advertisement

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×