E-Paper
Advertisement

Gautam Gambhir: గిల్ కు షాక్‌.. త‌న‌పైకి విమ‌ర్శ‌లు రాకుండా గంభీర్ స్కెచ్‌.. ఏకంగా రూ. 49 కోట్లు పెట్టి !

Gautam Gambhir: గిల్ కు షాక్‌.. త‌న‌పైకి విమ‌ర్శ‌లు రాకుండా గంభీర్ స్కెచ్‌.. ఏకంగా రూ. 49 కోట్లు పెట్టి !
Advertisement

Gautam Gambhir: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా వన్డే సిరీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. 3 వ‌న్డేల‌ సిరీస్ ను 2-0 తేడాతో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై దారుణంగా విమర్శలు చేస్తున్నారు. గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న‌ తప్పుడు నిర్ణయాల వల్ల టీమిండియా ఓడిపోయిందని అభిమానులందరూ ఫైర్ అవుతున్నారు. అనవసరమైన ప్రయోగాలు చేసి, టీమిండియా జట్టును నాశనం చేస్తున్నాడని గౌతమ్ గంభీర్ పై మండిపడుతున్నారు. అయితే టీమిండియా ఓడిపోయిన నేపథ్యంలో తన పైన నెగెటివిటీ రాకుండా గౌతమ్ గంభీర్ జాగ్రత్తగా పడుతున్నాడట.

Also Read: IND VS AUS, 2ND ODI: కొంప‌ముంచిన సిరాజ్ ఫీల్డింగ్..17 ఏళ్ల త‌ర్వాత టీమిండియా ఓట‌మి…సిరీస్ ఆస్ట్రేలియా వ‌శం

Advertisement

ఇందుకోసం తన పీఆర్ టీంను యాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది. తాను హెడ్ కోచ్ గా మారిన తర్వాత టీమ్ ఇండియా స్వరూపం మారిపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికోసం గౌతమ్ గంభీర్ కూడా భారీగానే ఖర్చులు పెడుతున్నారట. తనకు సపోర్ట్ గా ఓ పీఆర్‌ టీం ను మెయింటైన్ చేస్తున్న గౌతమ్ గంభీర్, దాదాపు 49 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. టీమిండియా ఓడితే, కెప్టెన్ గిల్‌, ప్లేయ‌ర్ల‌పైకి నెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ట‌.

రాహుల్ ద్రవిడ్, రవి శాస్త్రిపై ట్రోలింగ్

టీమిండియా దారుణంగా ఓడిపోయిన నేపథ్యంలో తనపై నెగిటివ్ ప్రచారం జరగకుండా గౌతమ్ గంభీర్ చాలా జాగ్రత్త పడుతున్నాడు. తాను వచ్చాకే టీమిండియా బాగుపడిందని ప్రచారం చేసుకుంటున్నాడు. అదే సమయంలో రాహుల్ ద్రావిడ్ తో పాటు రవిశాస్త్రిలను టార్గెట్ చేసి తన పిఆర్ టీంతో పోస్టులు పెట్టిస్తున్నాడు. వాళ్ళిద్దరూ కోచ్‌లుగా ఉన్నప్పుడు టీమిండియా పెద్దగా రాణించలేదని చెప్పే ప్రయత్నం చేయిస్తున్నాడు. తన సారధ్యంలోనే టీమిండియా అద్భుతంగా విజయాలు అందుకుంటుందని పోస్టులు పెట్టిస్తున్నాడు. ఇక ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఓడిపోయిన నేపథ్యంలో గిల్ కెప్టెన్సీ సరిగ్గా చేయలేదని ఇప్పుడు సీన్ రివర్స్ చేశాడు. విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ బాగా ఆడితే టీమిండియా కచ్చితంగా గెలిచేదని అర్థం వచ్చేలా పోస్టులు పెట్టిస్తున్నాడు.

గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో 5 సిరీస్ లు కోల్పోయిన టీమిండియా

Advertisement

వాస్తవంగా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్య‌తలు తీసుకున్న తర్వాత టీమిండియాకు పెద్ద బొక్కే పడింది. అతడి సారథ్యంలోనే ఏకంగా ఐదు సిరీస్ లు కోల్పోయింది టీమిండియా. సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయింది టీమిండియా. అలాగే శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ కూడా కోల్పోవడం జరిగింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో కూడా 4-1 తేడాతో చిత్తుచిత్తుగా ఓడిపోయింది టీమిండియా. ఇక మొన్న గిల్ కు కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ డ్రాగా ముగించుకుంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ కూడా కోల్పోయింది టీమిండియా.

Also Read: PSL-Multan Sultans: PCBలో ప్ర‌కంప‌న‌లు..ముల్తాన్ సుల్తాన్స్ పై నఖ్వీ కుట్ర‌లు..PSL టోర్న‌మెంటే ర‌ద్దు?

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×