E-Paper
Advertisement

Sourav Ganguly: గంగూలి పోస్టుతో.. నెట్టింట మంటలు

Sourav Ganguly: గంగూలి పోస్టుతో.. నెట్టింట మంటలు
Advertisement

Ganguly Post on Team India New Coach Various Reasponce Net Users: టీమ్ ఇండియా ప్రస్థానాన్ని రెండు భాగాలుగా విభజిస్తే సౌరభ్ గంగూలికి ముందు తర్వాత అని చెబుతారు. ఎందుకంటే ఒకప్పుడు టీమ్ ఇండియాలో అంటే సునీల్ గవాస్కర్, అజారుద్దీన్ లాంటి వారు ఉన్న సమయంలో మ్యాచ్ గెలవడం కంటే వ్యక్తిగత రికార్డులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు.

తను సెంచరీ చేశాడా? లేదా? తను మ్యాచ్ లో వికెట్లు తీసుకున్నాడా? లేదా? అంతే, మ్యాచ్ ఎలా పోయినా పర్వాలేదు. అంటే ఒక పోరాట పటిమ ఉండేది కాదు.. గెలవాలనే తపన ఉండేది కాదు.. దేశం కోసం ఆడుతున్నామనే స్ప్రహ ఉండేది కాదు.. వెళ్లామా? ఆడామా? వచ్చామా? లేదా? అంతే ఇలాగే ఉండేది.

Advertisement

కానీ గంగూలీ జట్టులోకి వచ్చిన తర్వాత పరిస్థితులను చూశాడు. తర్వాత కెప్టెన్ అయ్యాడు. అంతే జట్టులో ఒక కసిని నింపాడు. దేశం కోసం ఆడాలనే తపన రగలించాడు. వ్యక్తిగత రికార్డులు కాదు.. దేశ ప్రతిష్ట ముఖ్యమన్నాడు. మన జట్టు గెలిస్తే భారతదేశం గెలిచినట్టు అని చెప్పాడు. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 326 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన తర్వాత, నాట్ వెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత.. చొక్కా విప్పి తామెంత కసిగా ఉన్నామో ప్రపంచానికి చాటి చెప్పిన మొనగాడు సౌరభ్ గంగూలి.

టీమ్ ఇండియాలోకి రికమండేషన్లు కాదు, ఆడేవాళ్లు కావాలి, యువతరం కావాలని భావించి అలా ఎంతోమందికి అవకాశాలిచ్చాడు. అలా గంగూలీ కెప్టెన్సీలో వచ్చినవాడే మహేంద్ర సింగ్ ధోనీ.. ఇదంతా ఎందుకంటే ఒక కోచ్ కారణంగా సౌరభ్ గంగూలీ లాంటి వీరోచిత క్రికెటరు.. క్రికెట్ కే దూరమైపోయాడు.

Advertisement

ఆ కోచ్ ఎవరో కాదు.. విదేశీ కోచ్ గ్రెగ్ చాపెల్.. వీరేంద్ర సెహ్వాగ్ ని కొట్టి.. అవమానించిన వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఎంతో మౌనంగా, ఎంతో సహనంతో ఉండే సచిన్ టెండూల్కర్ లాంటి లెజండరీ క్రికెటర్ బహిరంగంగా.. ఆ కోచ్ వ్యవహార శైలిపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

Also Read: టీ20 టోర్నీకి ముందు, ఆసీస్‌ను కంగారెత్తించిన విండీస్ ఆటగాళ్లు

ఇదంతా ఎందుకంటే.. టీమ్ ఇండియాకి కొత్త కోచ్ ఎంపిక చేయడంపై కొన్ని పదునైన మాటలు అనడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఒక కోచ్ కారణంగా తన కెరీర్ నాశనమైంది. ఒక కోచ్ కారణంగా సెహ్వాగ్ దారుణంగా అవమానం పాలయ్యాడు. అందుకే గంగూలీ ఏమంటున్నాడంటే ఒక కోచ్ ని ఎంపికచేసేటప్పుడు అర్హతలు చూడాలని అన్నాడు.

ఎవరు పడితే వారు కోచ్ లు కాలేరని అన్నాడు. భారత జట్టు హెడ్ కోచ్ అంటే ఆషామాషీ వ్యవహారం కాదని, ఎంతోమంది  యువ ఆటగాళ్ల భవిష్యత్తు, అక్కడ ముడిపడి ఉందని అన్నాడు. అయితే ఇంతవరకు కోచ్ ఎవరన్నది బీసీసీఐ ప్రకటించ లేదు. కానీ గౌతం గంభీర్, ఆశిష్ నెహ్రా పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

ఈ సమయంలో సౌరభ్ గంగూలీ అన్నమాటలు నెట్టింట మంట పుట్టించాయి. చాలామంది గంగూలీని పట్టుకుని.. మీరు గంభీర్ ని ఉద్దేశించే అన్నారు కదా.. అని గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. మొత్తానికి వ్యవహారం రచ్చరచ్చగా మారడంపై బీసీసీఐ పునరాలోచనలో పడిన పడుతుందని మరికొందరు అంటున్నారు.

Tags

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×