E-Paper
Advertisement

Jofra Archer : బూమ్రాలాగే .. నువ్వూ ఐపీఎల్ ఆడొద్దు .. ఇంగ్లాండ్ బోర్డు ఫాస్ట్ బౌలర్ కి ఆదేశం

Jofra Archer : బూమ్రాలాగే .. నువ్వూ ఐపీఎల్ ఆడొద్దు .. ఇంగ్లాండ్ బోర్డు ఫాస్ట్ బౌలర్ కి ఆదేశం
Advertisement
Jofra Archer

Jofra Archer : ఇంగ్లాండ్ బోర్డు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 2023 వన్డే వరల్డ్ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా వెళ్లి ఘోర పరాభవం మూటగట్టుకు వచ్చింది. దీంతో ఇంగ్లండ్ పరువు పోవడమేకాదు, ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) పరువు కూడా పోయింది. సరే జరిగిందేదో జరిగిపోయింది, ముందు జరగాల్సినదేదో చూద్దామనే మానసిక స్థితికి బోర్డు వెళ్లింది.

అంతేగానీ పాకిస్తాన్, శ్రీలంక తరహాలో రచ్చ రచ్చ చేసుకోలేదు. జెంటిల్మెన్ క్రీడ పుట్టిందే ఇంగ్లండ్ లో… అందుకని ఆ మాటకి వన్నెతెచ్చేలా వాళ్లు హుందాగానే వ్యవహరించారు. ఓటమిని కూడా పాజిటివ్ గా నే తీసుకున్నారు, కానీ కొన్ని మార్పులు-చేర్పులపై ద్రష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో తమ వాడిని ఐపీఎల్ లో ఆడొద్దని సూచించింది.

Advertisement

విషయం ఏమిటంటే పేసర్ జోఫ్రా ఆర్చర్‌ ప్రత్యర్థులను భయపెడతాడు. అలాగే బ్యాటుతో కూడా  రాణించగలడు. అంటే ఆలౌరౌండర్ గా ఉపయోగపడతాడు. అందుకే ముంబయి ఇండియన్స్‌  ఏకంగా రూ. 8 కోట్లకు దక్కించుకుంది. కానీ ఈ ఏడాది ఐపీఎల్‌లో గాయపడి ప్రొఫెషనల్‌ క్రికెట్‌కు దూరమయ్యాడు. అయితే హార్దిక్ పాండ్యా ముంబయి జట్టులోకి వెళ్లడంతో ఆర్చర్ ని వదిలించుకుంది.

దీంతో అతనికి రాబోవు వేలంలో మంచి ధర పలుకుతుందని అంతా అనుకుంటున్నారు. ఈ సమయంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఏం చేసిందంటే, ఆర్చర్ ని ఐపీఎల్ లో ఆడొద్దని సూచించింది. దాంతో తను ఐపీఎల్ వేలంలో పేరును కూడా రిజిస్టర్‌ చేసుకోలేదు.

Advertisement

ఇలా చేయడం వెనుక ఇంగ్లండ్ బోర్డు వ్యూహాత్మక వైఖరి కనిపిస్తోంది. ఏప్రిల్, మే లో తమ పర్యవేక్షణలో ఆర్చర్‌ ఉంటే త్వరగా కోలుకుంటాడని ఈసీబీ భావిస్తోంది.
ఎందుకంటే టీ 20 వరల్డ్ కప్ నకు అతన్ని సిద్ధం చేయాలని భావిస్తోంది.

గతంలో బీసీసీఐ బుమ్రా విషయంలోనే ఇదే తరహా జాగ్రత్తలు పాటించింది. పనిభారం, గాయాల బారిన పడకూడదని దగ్గర పెట్టుకుంది. నేరుగా బుమ్రాను ఐర్లాండ్‌ సిరీస్‌కు ఎంపిక చేసి, అట్నుంచి అలా వన్డే వరల్డ్‌కప్‌ 2023లో బరిలోకి దించారు.

బూమ్రా గురించి బీసీసీఐ తీసుకున్న జాగర్తల బాటలోనే ఈసీబీ కూడా వెళుతోంది. ప్రపంచ దేశాల క్రికెట్ బోర్డులు బీసీసీఐ తీసుకునే నిర్ణయాలపై  ఎంతటి నిఘా పెట్టారో అర్థమవుతోంది. దీనిని మంచి పరిణామంగానే భావించాలని సీనియర్లు అంటున్నారు. ఈ లెక్కన చూస్తే ప్రపంచ క్లాస్ క్రికెట్ ని బీసీసీఐ అందిస్తుందని చెప్పాలని అంటున్నారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×