E-Paper
Advertisement

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?
Advertisement

Gambhir Off To India:  టీమిండియా వర్సెస్ ఇండియా (Team India vs. India) మధ్య జరిగిన వన్డే సిరీస్ నిన్నటితో ముగిసింది. ఈ నేపథ్యంలో టి20 సిరీస్ కోల్పోయినట్లుగానే ఈ వన్డే సిరీస్ కూడా దారుణంగా పోగొట్టుకుంది ఇండియా. టి20 సిరీస్ వైట్ వాష్ కాగా..2-1 తేడాతో వన్డే సిరీస్ పోగొట్టుకుంది టీమిండియా. అయితే, నిన్న లార్డ్స్ వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య చివరి వన్డే జరిగింది. ఇందులో చివరి వరకు పోరాడిన టీమ్ ఇండియా (Team India) ఓటమిపాలైంది. టీమిండియా ఓడిపోయిన వెంటనే అసహనం వ్యక్తం చేసిన గంభీర్ (Gambhir)… లార్డ్స్ (Lords) నుంచి నేరుగా ఇండియా ఫ్లైట్ ఎక్కినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Also Read: Ms Dhoni Ruling Team India: ధోని లేక సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. India)  మధ్య ఆదివారం లార్డ్స్ వేదికగా చివరి వన్డే జరిగింది. ఇందులో దారుణంగా ఓడిపోయిన టీమ్ ఇండియాను చూసి తట్టుకోలేని గౌతమ్ గంభీర్.. లార్డ్స్ నుంచి నేరుగా ఇంటికి బయలుదేరాడు. నిన్న మ్యాచ్ ఫినిష్ కాగానే అర్ధరాత్రి ఇండియా ఫ్లైట్ ఎక్కాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఇండియాకు గంభీర్ ఎందుకు వెళ్లాడ‌నే దానిపైన అనేక ర‌కాల అనుమానాలు వ‌స్తున్నాయి. అక్కడ ఉంటే, సిరీస్ ఓడించినందుకు తనును మరింత ట్రోలింగ్ చేస్తారనో ? లేక టీమిండియా ప్లేయర్లను ఎదుర్కోలేకనో ? లేదా రోహిత్ శ‌ర్మ‌ అలాగే విరాట్ కోహ్లీ అదిరిపోయే ఇన్నింగ్స్ చూసి తట్టుకోలేక వెళ్లిపోయాడో తెలియదు కానీ.. లార్డ్స్ ను వదిలి ఇండియాకు గంభీర్ వెళ్లడం హాట్ టాపిక్ అయింది. వాస్తవానికి మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత ప్లేయర్లు అందరితో మళ్లీ రివ్యూ మీటింగ్ పెట్టాలి. కానీ గౌతమ్ గంభీర్ అలా పెట్టకుండా వెళ్లిపోవడం పై విమర్శలు కూడా వస్తున్నాయి. ఇలాంటోడు హెడ్ కోచ్ గా ఉంటే వరల్డ్ కప్ గెలవడం కష్టమేనని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు.

బీసీసీఐపై అలిగిన గౌతమ్ గంభీర్ ?

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నిన్నటితో వన్డే సిరీస్ ముగిసిన నేపథ్యంలో.. గౌతమ్ గంభీర్ లార్డ్స్ ను ( IND VS ENG LORDS Match) వదిలి ఇంటికి వెళ్లడం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. జింబాబ్వే వర్సెస్ టీమిండియా మధ్య ఈనెల 23వ తేదీ నుంచి మూడు టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ను కాదని, వీవీఎస్ లక్ష్మణ్ ను అసిస్టెంట్ కోచ్ గా పంపించారు. దీనిపై గుర్రుగా ఉన్న గౌతమ్ గంభీర్.. తన నిరసనను తెలియజేస్తూ ఇంటికి వెళ్ళాడట.

Advertisement

Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×